Brutal Murder: ఇరాక్లోని బాగ్దాద్ లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ఓం ఫహద్ ను శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఓం ఫహద్ జయోనా జిల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే అర్థరాత్రి ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నట్లుగా నటించారు. అనంతరం అదును చూసుకుని ఒక్కసారిగా ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు విడించింది.
జయౌనా జిల్లాలోని ఓం ఫహద్ ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. బైక్మీద వచ్చి ఆమెపై కాల్పులు జరిపిన దుండగులు వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ హత్య జరిగిన ప్రాంతంలోనే 2020లో ఇరాక్ కు చెందిన సుప్రసిద్ధ భద్రతా నిపుణుడు హిషామ్ అల్ – హషిమిని దుండగులు కాల్చి చంపారు.
టిక్టాక్లో ఈమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇరాకీ సంగీతానికి ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అతి తక్కువ కాలంలోనే ఆమె స్టార్ గా ఎదిగారు. 2023 లో ప్రజా నైతికతను అణగదొక్కే విధంగా ప్రసంగం చేసినందుకు గానూ..ఆమెకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది.
Also Read:మాల్దీవుల్లో డ్రా‘గన్‘ భారత్ కి ముప్పుందా
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పాప్ మ్యుజిక్కు డ్యాన్స్ వీడియోలు చేయడం ప్రారంభించారు. టిక్టాక్ వీడియోలతో ఫేమస్ అయిన నూర్ అల్సఫర్ అనే యువతిని 2023లో కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఓం ఫహద్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.