E-Paper
Advertisement

Earthquake: 46 వేల మరణాలు.. నేటితో సహాయ చర్యలకు స్వస్తి

Earthquake: 46 వేల మరణాలు.. నేటితో సహాయ చర్యలకు స్వస్తి

Earthquake: భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా దేశాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. బహుల అంతస్థుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని దాదాపు 46 వేల మంది దుర్మరణం చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు భయటపడుతున్నాయి.

అయితే ప్రమాదం సంభవించి 296 గంటలు గడవడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టర్కీలో సహాయక చర్యలను ఈరోజుతో నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ అధిపతి యూనస్ సెజర్ వెల్లడించారు.

ఇక ఇప్పటి వరకు భూకంపం దెబ్బకు మూడు లక్షలకు పైగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటు రోగాల వ్యాప్తి క్రమంగా పెరుగతోంది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×