Rajamouli:టాలీవుడ్ను దాటి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకధీరుడు రాజమౌళి సినిమా వస్తోందంటే చాలు… ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో తీస్తున్న ‘వారణాసి’ పట్టాలెక్కుతుండగానే, జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుందనే హాట్ డిబేట్ సోషల్ మీడియాలో మొదలైంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ పేరు వినిపించినా, తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యతో రాజమౌళి చేతులు కలపబోతున్నారనే క్రేజీ బజ్ ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎవరూ ఊహించని ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ వెనుక ఉన్న అసలైన స్టాటజీ చూద్దాం..
రాజమౌళి, సూర్య కాంబినేషన్లో సినిమా రావాలనేది కేవలం అభిమానుల కోరిక మాత్రమే కాదు, స్వయంగా సూర్య కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో జక్కన్నతో పని చేయాలనే తన ఆకాంక్షను బయటపెట్టారు. గతంలో రామ్ చరణ్ బ్లాక్బస్టర్ హిట్ ‘మగధీర’ కథను ముందుగా సూర్యతోనే చేయాలని రాజమౌళి అనుకున్నారనే ప్రచారం కూడా ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అద్భుతమైన ప్రాజెక్ట్ కుదరలేదు. ఇక మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా పట్టాలెక్కబోతుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
రాజమౌళి సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్లు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మనకు తెలిసిందే. పాత్ర కోసం ఎంతటి కష్టమైనా పడటానికి సిద్ధపడే హీరో సూర్య. నటనలో వైవిధ్యం చూపిస్తూ, ఫిజిక్ను మార్చుకోవడంలో ఆయన స్టైలే వేరు. జక్కన్న ఆశించే పక్కా పర్ఫెక్షన్, ఎమోషన్స్ను పండించడంలో సూర్య వందకు వంద శాతం న్యాయం చేయగలరు. అందుకే మహేష్ బాబు ‘వారణాసి’ పూర్తయిన తర్వాత, సూర్యతో ఒక వినూత్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ లేదా పీరియాడిక్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది.
also read:40 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమైన బుల్లితెర నటి!
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. సూర్యకు తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ మరియు మార్కెట్ ఉంది. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్కు, సూర్యకున్న గ్లోబల్ మార్కెట్ తోడైతే సౌత్ సినిమా రేంజ్ మరో మెట్టు ఎక్కుతుంది. గతంలో వినిపించిన అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కంటే ముందే ఈ సూర్య సినిమా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు గట్టిగా అంచనా వేస్తున్నాయి.
ఏదైనా ప్రాజెక్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు రాజమౌళి టీమ్ నుండి ఎలాంటి లీక్స్ రావు. కానీ, సూర్య-రాజమౌళి కాంబినేషన్ కుదిరితే మాత్రం అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఈ ఇద్దరు దిగ్గజాల కాంబోకు ‘వారణాసి’ ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సూర్య అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జక్కన్న నుంచి వచ్చే ఆ అధికారిక ప్రకటన కోసమే ఇప్పుడు యావత్ సినీ ప్రపంచం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది..