Kothagudem Hospital: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం ఓ మహళా గర్భిణిని ఆసుపత్రికి వచ్చింది. చికిత్సనిమిత్తం వచ్చి ఆ మహిళా గర్చినిని అక్కడి సిబ్బంది ఎవరు పట్టించుకోలేదు.దీంలో ఆ మహిళ అలాగే ఓ పక్కకు నించుండి పోయింది.
దీంతో ప్రసవ వేదనతో ఆ మహిళ బెడ్ పక్కనే అలాగే నిల్చుండి పోయింది. దీంతో పురిటి నోప్పులు భరించలేక ఆ మహిళ నించోని బిడ్డకు జన్మరనిచ్చింది. దీంతో ప్రసవనంత పుట్టిన బిడ్డ నించున్న చోటే కిందపడిన నవజాత శిశువుకు గాయాలైనట్లు సమాచారం. మహిళకు అధిక రక్తస్రావం కావడంతో ఆందోళన చెందారు.
Also read: Gomaram Bal Reddy: మేడ్చల్ కాంగ్రెస్లో బిగ్ ట్విస్ట్.. జిల్లా ఉపాధ్యక్షుడిగా బాల్రెడ్డి!
ఈ ఘటనను చూసిన ఇతర గర్భిణీ మహిళలు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సరైన సమయానికి స్పందించలేదని అందువల్లే నవజాత శిశువుకు ఇలా జరిగిందని బాదిత మహిళ బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనతో కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Also read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. మరో కొత్త సేవలు!