E-Paper
Advertisement

Driverless Metro train : దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు..

Driverless Metro train : దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు..
Driverless metro services

Driverless metro services : దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు బెంగళూరు చేరింది. చైనా నుంచి గత వారం ఈ రైలు చెన్నై పోర్టులో దిగుమతి అయింది. ఆరు బోగీలు ఉన్న ఈ మెట్రో రైలును బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీలో అసెంబుల్ చేస్తారు. చైనా ఇంజనీర్ల సమక్షంలో రైలు బిగింపు జరగనుంది.

నమ్మ మెట్రో ఎల్లో లైన్‌లోని జయదేవ ఆస్పత్రి, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీ మీదుగా ఆర్వీ రోడ్డును బొమ్మ సంద్రతో కలిపే 19.15 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు.

నమ్మ మెట్రోకు మొత్తం 216 కోచ్‌లను అందించేందుకు చైనా ప్రభుత్వానికి చెందిన సీఆర్ఆర్సీ నాన్జింగ్ పుజెన్ కంపెనీ లిమిటెడ్ 2019లోనే ఒప్పందం చేసుకుంది. దాని విలువ మొత్తం రూ.1578 కోట్లు.

లఖ్‌నవూకి చెందిన రిసెర్చి డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 32 పరీక్షలు నిర్వహిస్తామని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మిలిటెడ్ తెలిపింది.

మే నాటికి రెండు రైళ్లు, ఆ తర్వాత ప్రతి నెలా రెండు రైళ్ల చొప్పున అందుతాయని భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో డ్రైవర్ రహిత మెట్రో రైలు బెంగళూరు వాసులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×