BigTV English
Advertisement

Navneet Kaur attacks Asaduddin Over Jai Palestine remarks: రాష్ట్రపతికి నవనీత్ కౌర్ లేఖ.. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ..

Navneet Kaur attacks Asaduddin Over Jai Palestine remarks: రాష్ట్రపతికి నవనీత్ కౌర్ లేఖ.. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ..

BJP Leader Navneet Rana Kaur attacks Asaduddin: పార్లమెంటులో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంపీలు రకరకాలుగా స్లోగన్లు ఇచ్చారు. ఇండియా కూటమి ఎంపీలు ఒకలా.. ఎన్డీయే కూటమి ఎంపీలు మరోలా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ మాత్రం ఇంకోలా నినాదం చేశారు. ప్రమాణస్వీకారం తరువాత జై పాలస్తీనా అంటూ స్లోగన్ ఇచ్చారు. దీంతో సభలో దుమారం రేగింది. అసదుద్దీన్ నినాదాన్ని రికార్డుల నుంచి తొలగించాలంటూ ఎన్డీయే కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.


అసదుద్దీన్ ఆ విధంగా నినాదం చేయడాన్ని తప్పుబడుతూ పలువురు బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా అమరావతి మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణా అసదుద్దీన్ పై సీరియస్ అయ్యింది. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఓవైసీ తన ప్రమాణం స్వీకారం కార్యక్రమంలో జై పాలస్తీనా నినాదాన్ని లేవనెత్తడం ద్వారా భారత్ కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారంటూ ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.

కాగా, జూన్ 25న అసదుద్దీన్ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణంలో అసదుద్దీన్ ఓవైసీ.. జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సభలోని కేంద్రమంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధ మోహన్ సింగ్ స్పందించారు. ఓవైసీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామంటూ స్పష్టం చేశారు. తాజాగా నవనీత్ కౌర్ కూడా రాష్ట్రపతికి లేఖ రాసి ఓవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.


Also Read: నీట్‌పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్

ఇదిలా ఉంటే.. లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ప్రచారంలో పాల్గొన్న నవనీత్ కౌర్.. ఎంపీ అసదుద్దీన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఓవైసీపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి తరఫున నవనత్ కౌర్ ప్రచారం చేశారు. ఆశ్చర్యపరిచే విషయమేమంటే.. వీరిద్దరూ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×