E-Paper
Advertisement

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!
Advertisement

Parliament Session: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజే వేడి రాజుకుంది! నీట్ పేపర్ లీకేజీ ఇష్యూపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభలను ఎన్నిసార్లు వాయిదా వేసినా.. విపక్షాలు వెనక్కి తగ్గలేదు. చివరకు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.

సుదీర్ఘకాలంగా నలుగుతున్న డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై గెలుపు జెండా ఎగురవేయాలని ఎన్డీయే పట్టుదలతో ఉంది. పరీక్షల పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు అయోధ్య రాముడి గుడిలో కానుకల చోరీ వ్యవహారంపై సభను స్తంభించజేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాయి.

Advertisement

గతంలో మహిళా, డీలిమిటేషన్‌ బిల్లును పాస్‌ చేయించడంలో ఫెయిలైన NDA.. ఈసారి సంఖ్యబలాన్ని పెంచుకుంది. కానీ ఇంత గందరగోళం మధ్య కేంద్రం పాచికలు పారుతాయా. జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలను ఎన్డీయే ప్రభుత్వం ఒప్పిస్తుందా? అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్‌లో బిగ్ డిబేట్ పాయింట్స్‌గా మారాయి.

అధికారంలో ఉన్న నేతలకు పట్టుదల ఉండొచ్చు. విపక్షాలకు ఆగ్రహం ఉండవచ్చు! కానీ ప్రజాస్వామ్యంలో వీటన్నింటికంటే ప్రజల సమస్యలే ముఖ్యం. పార్లమెంట్ నుంచి వాయిదాల ప్రకటనలు కాదు.. సామాన్యుడికి న్యాయం కావాలి! మరి ఈ సమావేశాలైనా ఆ దిశగా సాగుతాయో లేదో వేచి చూడాలి!

Advertisement

Also Read: బుల్లెట్ ట్రైన్ హబ్‌కు హైకోర్టు బ్రేక్.. బహదూర్ గూడ రైతులకు బిగ్ రిలీఫ్!

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×