Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే వేడి రాజుకుంది! నీట్ పేపర్ లీకేజీ ఇష్యూపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభలను ఎన్నిసార్లు వాయిదా వేసినా.. విపక్షాలు వెనక్కి తగ్గలేదు. చివరకు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.
సుదీర్ఘకాలంగా నలుగుతున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై గెలుపు జెండా ఎగురవేయాలని ఎన్డీయే పట్టుదలతో ఉంది. పరీక్షల పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు అయోధ్య రాముడి గుడిలో కానుకల చోరీ వ్యవహారంపై సభను స్తంభించజేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాయి.
గతంలో మహిళా, డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించడంలో ఫెయిలైన NDA.. ఈసారి సంఖ్యబలాన్ని పెంచుకుంది. కానీ ఇంత గందరగోళం మధ్య కేంద్రం పాచికలు పారుతాయా. జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలను ఎన్డీయే ప్రభుత్వం ఒప్పిస్తుందా? అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో బిగ్ డిబేట్ పాయింట్స్గా మారాయి.
అధికారంలో ఉన్న నేతలకు పట్టుదల ఉండొచ్చు. విపక్షాలకు ఆగ్రహం ఉండవచ్చు! కానీ ప్రజాస్వామ్యంలో వీటన్నింటికంటే ప్రజల సమస్యలే ముఖ్యం. పార్లమెంట్ నుంచి వాయిదాల ప్రకటనలు కాదు.. సామాన్యుడికి న్యాయం కావాలి! మరి ఈ సమావేశాలైనా ఆ దిశగా సాగుతాయో లేదో వేచి చూడాలి!
Also Read: బుల్లెట్ ట్రైన్ హబ్కు హైకోర్టు బ్రేక్.. బహదూర్ గూడ రైతులకు బిగ్ రిలీఫ్!