E-Paper
Advertisement

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?
Advertisement

DGP Suicide: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాజధాని అగర్తలాలో పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన కార్యాలయంలో ఆయన విగత జీవిగా కనిపించారు. తన వద్దనున్న గన్‌తో ఆయన కాల్చుకున్నట్లు తెలుస్తోంది. డీజీపీ మృతిపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌

1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనురాగ్‌ ధన్కడ్‌. మూడు దశాబ్దాలుగా పైగా త్రిపుర పోలీసు విభాగంలో ఆయన పని చేస్తున్నారు. గతేడాది మే లో త్రిపుర పోలీసు డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు త్రిపుర రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీగా పని చేశారు. అంతకుముందు ఆయన సీబీఐ, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, కొసావోలోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో పని చేశారు.

విచారణకు ప్రభుత్వ ఆదేశం

Advertisement

సీబీఐలో ఆయన పని చేసిన కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు నీరవ్ మోడీపై దర్యాప్తునకు నాయకత్వం వహించారు. సీబీఐలో ఎస్పీ స్థాయి నుంచి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, జాయింట్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్ వంటి పలు కీలక పదవులు చేపట్టారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-సీఐఎస్ఎఫ్ లో ఇన్‌స్పెక్టర్ జనరల్ గా పని చేసిన అనుభవం ఆయన సొంతం.

ప్రాథమిక సమాచారం ప్రకారం ధన్వడ్‌ తన సొంత సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కచ్చితమైన పరిస్థితులు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే డీజీపీ అనురాగ్  వెంటనే గోవింద్ బల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రి వర్గాలు ఏం చెప్పాయి?

Advertisement

అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో ఆయనకు దాదాపు 40 నిమిషాలకు పైగా సీపీఆర్ చేసి ప్రయత్నించామని, కానీ ఫలితం లేకపోయిందని తెలిపాయి. పోస్ట్‌మార్టం నివేదికలో ఏ విధంగా జరిగిందనేది తెలుస్తుందని చెప్పాయి.

ALSO READ: రేషన్ దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల సరుకులు, ఇంకెందుకు ఆలస్యం

 

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×