BigTV English

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

Air India Express: ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. అబుదబీ నుంచి కాలికట్‌కు వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి అబుదబీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.


శుక్రవారం ఉదయం అబుదబీ నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయి 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్నవారికి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ తిరిగి విమానాన్ని అబుదబీలో ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని ఎయిరిండియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తిరిగి ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు వివరించింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×