E-Paper
Advertisement

Ayodhya: అయోధ్య రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత

Ayodhya: అయోధ్య రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత
Advertisement

Ayodhya: అయోధ్య రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితుడు పండిత్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ శనివారం కన్నుమూశారు. 86 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన హందూ సమాజం పట్ల ఎంతో భక్తి, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అయోధ్య రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎంపికైన 121 మంది పండితుల బృందానికి పండిత్ లక్ష్మీకాంత్ నాయకత్వం వహించారు. వారణాసికి చెందిన మధురనాథ్ దీక్షిత్ 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కాశీ పండితుడు. గాగా భట్ వారసుడు దీక్షిత్ వంశస్తులు 1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకానికి నాయకత్వం వహించారు.

ఆచార్య మృతి పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. దీక్షిత్ మృతి సమాజానికి తీరని లోటు అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యెగీ ఆదిత్యనాథ్ ఆచార్య దీక్షిత్ మృతికి సంతాపం తెలుపుతూ కాశీకి చెందిన శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ మరణం ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు పూడ్చలేని లోటని, సంస్కృత భాష భారతీయ సంస్కృతికి దీక్షిత్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Advertisement

 

Tags

Related News

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

Big Stories

Advertisement
×