E-Paper
Advertisement

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
Advertisement

Fire Accident in delhi(Telugu news live today): దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న మొత్తం తొమ్మిది మందిని రక్షించారు.

Advertisement

ఫ్యాక్టరీ యజమానులు అంకిత్, విజయ్ గుప్తా అని పోలీసులు తెలిపారు. వారు రోహిణి ఏరియాలో నివాసం ఉంటున్నారని అన్నారు. ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ప్రమాద జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యజమానులపై పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

Also Read: జమ్ముకశ్మీర్ లో కాల్పులు.. ఒకరు మృతి, సరిహద్దులకు బలగాలు

Advertisement

ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పి వేస్తున్నాయి. ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Tags

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×