Fire Accident in delhi(Telugu news live today): దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న మొత్తం తొమ్మిది మందిని రక్షించారు.
ఫ్యాక్టరీ యజమానులు అంకిత్, విజయ్ గుప్తా అని పోలీసులు తెలిపారు. వారు రోహిణి ఏరియాలో నివాసం ఉంటున్నారని అన్నారు. ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ప్రమాద జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యజమానులపై పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
Also Read: జమ్ముకశ్మీర్ లో కాల్పులు.. ఒకరు మృతి, సరిహద్దులకు బలగాలు
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పి వేస్తున్నాయి. ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Fire broke out in a restaurant in Delhi's Shaheen Bagh area.
According to Delhi Fire Service, the fire first started in the electrical wires after which it spread to the restaurant. 7 fire engines are on the spot and the work of extinguishing the fire is underway.… pic.twitter.com/WLV75vJyTu
— ANI (@ANI) June 8, 2024