E-Paper
Advertisement

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Fire Accident in delhi(Telugu news live today): దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న మొత్తం తొమ్మిది మందిని రక్షించారు.

ఫ్యాక్టరీ యజమానులు అంకిత్, విజయ్ గుప్తా అని పోలీసులు తెలిపారు. వారు రోహిణి ఏరియాలో నివాసం ఉంటున్నారని అన్నారు. ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ప్రమాద జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యజమానులపై పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

Also Read: జమ్ముకశ్మీర్ లో కాల్పులు.. ఒకరు మృతి, సరిహద్దులకు బలగాలు

ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పి వేస్తున్నాయి. ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×