BigTV English
Advertisement

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా అంటూ..?

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా అంటూ..?

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే.. ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని గుర్తు చేశారు. వారితో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో చూపించి “ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా?” అని ఎద్దేవా చేశారు.


బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు “మేము కాంగ్రెస్‌లో చేరలేదు” అని చెప్పడాన్ని కేటీఆర్ నిలదీశారు. అది కాంగ్రెస్ కండువా కాదు అని అంటున్నారు.. మీరు దీన్ని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. “ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?” అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు. రాహుల్ గాంధీకి సిగ్గు లేదని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తప్పనిసరి అని ఆయన గుర్తుచేశారు.

ALSO READ: Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 జీతం.. ఇంకెందుకు ఆలస్యం


ఇలాంటి ఫిరాయింపులు రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పరిస్థితిని చూసుకుని సిగ్గుపడాలని, వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేపాయి. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి, ఉపఎన్నికల్లో పోటీ చేయమని సవాల్ విసిరారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నమ్మకం ఉంటే ఉపఎన్నికలకు రెడీ కావాలని ఛాలెంజ్ చేశారు..

ALSO READ: Airport Authority of India: ఇది అద్భుమైన అవకాశం.. ఎయిర్‌పోర్టుల్లో భారీగా ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు బ్రో

సుప్రీంకోర్టు ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఆదేశాలను కొట్టివేసి, స్పీకర్‌కు నిర్ణయం తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్‌ఎస్ నేతలు ఉప ఎన్నికలకు రావాలని స్పీకర్ పై ఒత్తిడి చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫిరాయింపులు రాజకీయాల్లో సాధారణమే అయినప్పటికీ.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కేటీఆర్ చెప్పారు. ఇది తెలంగాణలోని రాజకీయ డైనమిక్స్‌ను మార్చే అవకాశం ఉంది.

Tags

Related News

DCC President Post: సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు ఎవరు?

Jubilee Hills : జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. గెలుపు డిసైడ్ చేసేది వాళ్లేనా?

Misuse of scholarship funds: స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగంపై ఉక్కుపాదం.. విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశం

SFI: స్టూడెంట్స్‌కు అలెర్ట్.. రేపు అన్ని కాలేజీలు బంద్.. ఎందుకంటే?

Heavy Rains: భారీ వర్షాలు.. రైళ్లలో చిక్కుకున్న ప్రయాణికులను ఆదుకున్న పోలీసులు

Heavy rains: అత్యంత భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ

Jangaon District: విద్యార్థులందరూ భోజనం చేశాక సాంబార్‌లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన

RS Praveen Kumar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. నవీన్ యాదవ్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

Big Stories

×