E-Paper
Advertisement

Firing in Samba Border : జమ్ముకశ్మీర్ లో కాల్పులు.. ఒకరు మృతి, సరిహద్దులకు బలగాలు

Firing in Samba Border : జమ్ముకశ్మీర్ లో కాల్పులు.. ఒకరు మృతి, సరిహద్దులకు బలగాలు
Advertisement

Firing in Jammu Kashmir Border(Latest telugu news): జమ్మూకశ్మీర్ లోని సాంబా జిల్లా అంతర్జాతీయ సరిహద్దులో అనుమానాస్పద కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. శనివారం అధికారులు అక్కడ బలగాలను మోహరించారు. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో 28 ఏళ్ల కార్మికుడి ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో.. అతను అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని అధికారులు వాసుగా గుర్తించారు.

గాయపడిన వెంటనే వాసుని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మృతుడు అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న ఒక నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడని, ఆ సమయంలోనే అతను కాల్పులకు గురయ్యాడని అధికారులు తెలిపారు. ఈ కాల్పులతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ఎన్నికల సమయంలోనూ జమ్మూకశ్మీర్ లో కాల్పులు జరిగాయి. మే 18న ఉగ్రవాదుల దాడిలో బీజేపీ మాజీ సర్పంచ్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. షోపియాన్ జిల్లా హుర్ పురా గ్రామంలో బీజేపీ మాజీ సర్పంచ్ ఐజాజ్ అహ్మద్ షేక్ పై కాల్పులు జరగ్గా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. జైపూర్ కు చెందిన దంపతులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×