E-Paper
Advertisement

NEET Retest: టాప్ స్కోర్లు వచ్చిన హర్యానా సెంటర్‌లో రీటెస్ట్ తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయి?

NEET Retest: టాప్ స్కోర్లు వచ్చిన హర్యానా సెంటర్‌లో రీటెస్ట్ తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయి?

Top Scores: హర్యానాలోని ఓ నీట్ పరీక్షా కేంద్రంలో రాసిన పలువురు విద్యార్థుల స్కోర్లు అనుమానాలను రేకెత్తించాయి. ఒకే సెంటర్‌లో రాసిన ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి. సుమారు 500 మంది ఆ సెంటర్‌లో పరీక్ష రాయగా.. ఇద్దరు స్టూడెంట్లకు గ్రేస్ మార్కులు మినహా 718 మరియు 719 మార్కులు వచ్చాయి. ఇది అసాధ్యం. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారించింది. మళ్లీ పరీక్ష నిర్వహించడానికి ఆదేశించింది. అప్పుడు అనూహ్యంగా మార్కులు వచ్చిన హర్యానాకు చెందిన ఆ సెంటర్‌లో ఇప్పుడు రీటెస్టు నిర్వహించిన తర్వాత ఫలితాలు ఎలా వచ్చాయి?

హర్యానాకు చెందిన బహదూర్‌గడ్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్‌లో 494 మంది స్టూడెంట్లు మళ్లీ నీట్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో అత్యధికంగా ఓ విద్యార్థి 682 మార్కులు సాధించాడు. మరో 13 మంది విద్యార్థులు 600 మార్కులను దాటగలిగారు. మే 5వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉన్నాయి. అప్పుడు ఆ సెంటర్‌లో ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు సంపాదించగా.. రీ ఎగ్జామినేషన్‌లో గరిష్టంగా ఒక విద్యార్థి 682 మార్కులు సాధించారు.

ఈ పరీక్షా కేంద్రంలో ఊహించని రీతిలో ఫలితాలు రావడంతోనే నీట్ పరీక్ష నిర్వహణపైనే అనుమానాలు వచ్చాయి. సాధ్యం కాని రీతిలో ఫలితాలు రావడంతో పలువురు కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. గ్రేస్ మార్కులను రద్దు చేస్తూ.. 1,563 మంది అభ్యర్థులను మళ్లీ పరీక్ష రాయాలని ఆదేశించింది. ఇందులో 800 మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాశారు.

Also Read: పాఠశాలల వేళల్లో మార్పు.. ఉత్తర్వులు జారీ

మే 5వ తేదీన దేశవ్యాప్తంగా 4750 సెంటర్‌లలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. నిర్వహణా లోపాలు, పేపర్ లీక్‌లతో పరీక్షపై తీవ్ర అనుమానాలు, అభ్యంతరాలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఇంకా వాదనలు వింటున్నది. తదుపరి విచారణ జులై 22వ తేదీన ఉన్నది. చాలా పిటిషన్లు ఈ పరీక్షను రద్దు చేయాలని, మరికొన్ని రీటెస్టు చేయాలని, ఇంకొన్ని పిటిషన్లు ఈ అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తులతో దాఖలయ్యాయి.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×