E-Paper
Advertisement

NEET Retest: టాప్ స్కోర్లు వచ్చిన హర్యానా సెంటర్‌లో రీటెస్ట్ తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయి?

NEET Retest: టాప్ స్కోర్లు వచ్చిన హర్యానా సెంటర్‌లో రీటెస్ట్ తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయి?
Advertisement

Top Scores: హర్యానాలోని ఓ నీట్ పరీక్షా కేంద్రంలో రాసిన పలువురు విద్యార్థుల స్కోర్లు అనుమానాలను రేకెత్తించాయి. ఒకే సెంటర్‌లో రాసిన ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి. సుమారు 500 మంది ఆ సెంటర్‌లో పరీక్ష రాయగా.. ఇద్దరు స్టూడెంట్లకు గ్రేస్ మార్కులు మినహా 718 మరియు 719 మార్కులు వచ్చాయి. ఇది అసాధ్యం. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారించింది. మళ్లీ పరీక్ష నిర్వహించడానికి ఆదేశించింది. అప్పుడు అనూహ్యంగా మార్కులు వచ్చిన హర్యానాకు చెందిన ఆ సెంటర్‌లో ఇప్పుడు రీటెస్టు నిర్వహించిన తర్వాత ఫలితాలు ఎలా వచ్చాయి?

హర్యానాకు చెందిన బహదూర్‌గడ్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్‌లో 494 మంది స్టూడెంట్లు మళ్లీ నీట్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో అత్యధికంగా ఓ విద్యార్థి 682 మార్కులు సాధించాడు. మరో 13 మంది విద్యార్థులు 600 మార్కులను దాటగలిగారు. మే 5వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉన్నాయి. అప్పుడు ఆ సెంటర్‌లో ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు సంపాదించగా.. రీ ఎగ్జామినేషన్‌లో గరిష్టంగా ఒక విద్యార్థి 682 మార్కులు సాధించారు.

Advertisement

ఈ పరీక్షా కేంద్రంలో ఊహించని రీతిలో ఫలితాలు రావడంతోనే నీట్ పరీక్ష నిర్వహణపైనే అనుమానాలు వచ్చాయి. సాధ్యం కాని రీతిలో ఫలితాలు రావడంతో పలువురు కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. గ్రేస్ మార్కులను రద్దు చేస్తూ.. 1,563 మంది అభ్యర్థులను మళ్లీ పరీక్ష రాయాలని ఆదేశించింది. ఇందులో 800 మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాశారు.

Also Read: పాఠశాలల వేళల్లో మార్పు.. ఉత్తర్వులు జారీ

Advertisement

మే 5వ తేదీన దేశవ్యాప్తంగా 4750 సెంటర్‌లలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. నిర్వహణా లోపాలు, పేపర్ లీక్‌లతో పరీక్షపై తీవ్ర అనుమానాలు, అభ్యంతరాలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఇంకా వాదనలు వింటున్నది. తదుపరి విచారణ జులై 22వ తేదీన ఉన్నది. చాలా పిటిషన్లు ఈ పరీక్షను రద్దు చేయాలని, మరికొన్ని రీటెస్టు చేయాలని, ఇంకొన్ని పిటిషన్లు ఈ అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తులతో దాఖలయ్యాయి.

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×