Indians in UAE Population: మధ్యప్రాచ్యంలోని గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలలో భారతీయుల పాత్ర అత్యంత కీలకం. ఈ దేశాలు దశాబ్దాలుగా భారతీయులకు ప్రధాన ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. కేవలం నైపుణ్యం లేని కార్మికులే కాకుండా, నేడు ఐటీ, వైద్యం, ఇంజనీరింగ్ వంటి రంగాలలో నిపుణులైన భారతీయులు కూడా గల్ఫ్ దేశాలలో భారీ సంఖ్యలో స్థిరపడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం, వివిధ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య మిలియన్లకు చేరుకుంది.
అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో భారతీయులు నివసిస్తున్నారు. ఇక్కడ సుమారు 3.9 మిలియన్ల మంది భారతీయలు ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత స్థానంలో సౌదీ అరేబియా ఉండగా.. ఇక్కడ దాదాపు 2.75 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు. కువైట్ లో సుమారు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఖతర్ లో ఫిఫా వరల్డ్ కప్ తర్వాత ఇక్కడ భారతీయుల సంఖ్య పెరిగి 8.3 లక్షలకు చేరింది. ఒమన్లో ఇక్కడ సుమారు 6.62 లక్షల మంది భారతీయులు ఉన్నారు. బహ్రెయిన్లో 3.47 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.
పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇంత భారీ సంఖ్యలో ఉన్న భారతీయుల భద్రత ఇప్పుడు భారత ప్రభుత్వానికి సవాలుగా మారింది. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండటంతో కేంద్ర విదేశాంగ శాఖ నిరంతరం గల్ఫ్ దేశాలలోని రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటోంది. భారతీయులు పంపే విదేశీ ద్రవ్యం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ శాఖ (MEA) గల్ఫ్ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ వంటి దేశాలకు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే సౌదీ, యూఏఈ, ఒమాన్ వంటి దేశాల నుండి భారత్కు విమాన రాకపోకలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.