BigTV English

Lottery: జాక్‌పాట్.. ఓవర్‌నైట్‌లో కోటీశ్వరుడైన వృద్ధుడు

Lottery: జాక్‌పాట్.. ఓవర్‌నైట్‌లో కోటీశ్వరుడైన వృద్ధుడు

Lottery: అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కసారి తలుపుతడితే ఓవర్‌నైట్‌లో కుటుంబ తలరాతే మారిపోతుంది. అలా జాక్‌పాట్ తగిలి కోటీశ్వరులైన వారు ఎందరో ఉన్నారు. తాజాగా పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడికి 88 ఏళ్ల వయస్సులో జాక్‌పాట్ తగిలింది. సంక్రాంతి లాటరీలో ఏకంగా రూ. 5 కోట్లు గెలుచుకున్నాడు.


మహంత్ ద్వారకా దాస్ అనే వృద్ధుడు 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చి పంజాబ్‌లోని డేరాబస్సిలో స్థిరపడిపోయాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహంత్.. దాదాపు 40 ఏళ్లుగా లాటరీలను కొనుగోలు చేస్తున్నాడు. 40 ఏళ్లలో ఒక్కసారి కూడా లాటరీ తగలకపోయినా నిరాశ చెందకుండా కొనుగోలు చేస్తూ వచ్చాడు. ఏదో ఒక రోజు అదృష్టం తన తలుపు తడుతుందని మహంద్ గట్టిగా నమ్మేవాడు.

ఈక్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహంత్ ఓ లాటరీని కొనుగోలు చేశాడు. ఇటీవల డ్రా తీయగా అదే నంబర్‌కు లాటరీ తగిలింది. మొత్తం రూ. 5 కోట్లను మహంత్ గెలుచుకున్నాడు. అన్ని పన్నులు పోనూ మహంత్‌కు రూ. 3.5 కోట్లు అందనుంది. దీంతో మహంత్ సంతోషానికి అవదులు లేవు. పట్టరాని సంతోషంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు అతనికి పూలమాలలు వేసి అభినందించారు.


40 ఏళ్ల తన కల ఇప్పుడు నెరవేరిందని మహంత్ ద్వారకా దాస్ తెలిపారు. తనకు వచ్చిన డబ్బులో సగం తన ఇద్దరు కొడుకులకు పంచి మిగతా సగాన్ని డేరాకు విరాళంగా ఇస్తానని వెల్లడించాడు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×