Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రముఖ ఆలయాలు, దర్గాలను దర్శించుకున్నారు. తొలుత ఢిల్లీలోని రామ్ దర్భార్ మందిరంలోకి వెళ్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికగా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు.. రాహుల్గాంధీకి పూలమాలలతో సత్కరించారు. పూజల్లో రాహుల్గాంధీతో పాటు ప్రియాంక పాల్గొన్నారు.
అనంతరం హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను..రాహుల్గాంధీ దర్శించుకున్నారు. చాదర్ వేసి… ప్రార్థనల్లో పాల్గొన్నారు.రాహుల్గాంధీకి ముస్లిం పెద్దలు, దర్గా నిర్వహకులు ఘనస్వాగతం పలికారు. రాహుల్ తీసుకొచ్చిన పూలను తీసుకున్న మతాధికారులు.. వాటిని చాదర్పై చల్లారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో రాహుల్ పాల్గొన్నారు.