Big Stories

Rahul Gandhi : రామ్ దర్బార్ మందిరం..నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రముఖ ఆలయాలు, దర్గాలను దర్శించుకున్నారు. తొలుత ఢిల్లీలోని రామ్‌ దర్భార్‌ మందిరంలోకి వెళ్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికగా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు.. రాహుల్‌గాంధీకి పూలమాలలతో సత్కరించారు. పూజల్లో రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంక పాల్గొన్నారు.

- Advertisement -

అనంతరం హజ్రత్‌ నిజాముద్దీన్ దర్గాను..రాహుల్‌గాంధీ దర్శించుకున్నారు. చాదర్‌ వేసి… ప్రార్థనల్లో పాల్గొన్నారు.రాహుల్‌గాంధీకి ముస్లిం పెద్దలు, దర్గా నిర్వహకులు ఘనస్వాగతం పలికారు. రాహుల్‌ తీసుకొచ్చిన పూలను తీసుకున్న మతాధికారులు.. వాటిని చాదర్‌పై చల్లారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో రాహుల్‌ పాల్గొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News