E-Paper
Advertisement

సీఎం బిశ్వశర్మపై రాహుల్‌గాంధీ ఆగ్రహం.. ఆయన్ని వదిలిపెట్టం, చట్టపరమైన చర్యలు తప్పవు

సీఎం బిశ్వశర్మపై రాహుల్‌గాంధీ ఆగ్రహం.. ఆయన్ని  వదిలిపెట్టం, చట్టపరమైన చర్యలు తప్పవు

Assam Assembly Elections-2026: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఆయన అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

అస్సాంలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్‌ చరియాలీలో తలపెట్టిన ప్రచార సభలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం హిమంత బిశ్వశర్మను దేశంలో అత్యంత అవినీతిపరుడిగా అభివర్ణించారు. ఆయన క్షమాపణలు చెప్పినా వదిలి పెట్టబోమని తేల్చిచెప్పారు.

అస్సాం ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన జీవితాంతం దివంగత గాయకుడు జుబిన్‌ గార్గ్‌ కృషి చేశారని తెలిపారు. ఆయన ఎవరితో దురుసుగా ప్రవర్తించలేదని, మా పార్టీ భావజాలం అలాంటిదేనని అన్నారు. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచడమే మా సిద్ధాంతమని మనసులోని మాట బయటపెట్టారు.

సీఎం హిమంత బిశ్వశర్మపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్‌గాంధీ

తాము అధికారంలోకి రాగానే ఆయన మృతి కేసు నిందితులను కేవలం 100 రోజుల్లోగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హిమంత బిశ్వశర్మ సర్కారు ప్రజల్లో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు రాహుల్‌ గాంధీ. ఆయన అవినీతి చిట్టా ప్రధాని, హోం మంత్రి వద్ద ఉందన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ ఏటీఎం మాదిరిగా మార్చేశారని విమర్శించారు.

సంక్షేమ చర్యలు, సామాజిక గుర్తింపుపై దృష్టి సారిస్తుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో కీలక హామీల గురించి వివరించారు. అస్సాంలోని ఆరు వర్గాలకు షెడ్యూల్డ్ కుల/షెడ్యూల్డ్ తెగ హోదాను కల్పిస్తామని వెల్లడించారు. తేయాకు కార్మికుల వేతనాలను మెరుగుపరుస్తామని తేల్చి చెప్పారు.

ALSO READ: గ్యాస్ కష్టాలు తీరినట్టే.. ఆలస్యం లేకుండా క్షణాల్లో గ్యాస్ డెలివరీ, వినియోగదారుల క్యూ లైన్ మాటేంటి?

తేయాకు కార్మికులకు రోజుకు రూ. 450 ఇస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నట్లు వివరించారు. ఆర్థిక, సామాజిక సహాయక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అధికారం రాగానే తక్కువ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందన్నారు.

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×