E-Paper
Advertisement

Seema Haider : మతం మారిన పాకిస్తాన్ యువతి.. సీమా హైదర్ నోట శ్రీరాముని పాట..

Seema Haider : ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గ్రేటర్‌ నోయిడాలోని రఘుపూర్‌లో ప్రస్తుతం తన ప్రియుడు సచిన్‌ మీనాతో కలిసి ఆమె నివసిస్తుంది. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి ప్రశంసలు పొందింది. ముస్లిం మహిళ అయినా సీమ హిందు ఆరాధన చేయటం సంచలనం అయింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్‌ చాలీసా పఠిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా‌లో వైరల్ అవుతుంది.

Seema Haider : మతం మారిన పాకిస్తాన్ యువతి.. సీమా హైదర్ నోట శ్రీరాముని పాట..
Advertisement

Seema Haider : ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గ్రేటర్‌ నోయిడాలోని రఘుపూర్‌లో ప్రస్తుతం తన ప్రియుడు సచిన్‌ మీనాతో కలిసి ఆమె నివసిస్తుంది. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి ప్రశంసలు పొందింది. ముస్లిం మహిళ అయినా సీమ హిందు ఆరాధన చేయటం సంచలనం అయింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్‌ చాలీసా పఠిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా‌లో వైరల్ అవుతుంది.

సీమా- సచిన్ నివసించే రబూపురాలో స్థానిక ఆలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు రాముడి కీర్తనలు, హనుమాన్‌ పాటలు పాడారు. సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్‌ ఆయేంగే’ పాటను పాడారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో ఉత్సాహంతో పాటను పాడారు. ఆ తర్వాత ఆమెతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్‌ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్‌ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

Advertisement

అనుమతి లభించగానే అయోధ్యలోని రామమందిరం దర్శనం‌కి వెళ్తామని సీమ హైదర్ తెలిపింది. భారత్‌లో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్‌లో మహిళలకు ప్రత్యేక విలువ ఉందని ఆమె పేర్కొంది . ఆమె పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు ప్రకటించింది. ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని తెలిపింది.

కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం సంచలనం సృష్టించింది. ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌తో భారత్‌కి చెందిన సచీన్ మీనా‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. నేపాల్‌లో మొదటిసారిగా వీరు కలుసుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా పాకిస్థాన్ నుంచి తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియాకు చేరుకుంది. గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చేసింది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ నెటిజన్ల‌తో ఎప్పటికప్పుడు సీమా హైదర్ టచ్‌లో ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×