E-Paper
Advertisement

UGC-NET: పేపర్ లీక్ చేసిన ఛానళ్లను బ్లాక్ చేసిన టెలిగ్రామ్

UGC-NET: పేపర్ లీక్ చేసిన ఛానళ్లను బ్లాక్ చేసిన టెలిగ్రామ్
Advertisement

UGC- NET: యూజీసీ నెట్ పేపర్ లీక్‌పై టెలిగ్రామ్ స్పందించింది. పేపర్ లీక్‌లో పాలు పంచుకున్న ఛానళ్లను బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించింది. అధికారులు చేస్తున్న విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ప్రశ్నా పత్రాలకు సంబంధించిన అనధికార కాపీలను సర్క్యులేట్ చేసిన ఛానళ్లను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు ప్రకటించింది.

నీట్ పేపర్ లీక్ వ్యవహారం, అదే సమయంలో నెట్ పరీక్ష రద్దు కావడం వంటి అంశాలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. యూజీసీ నెట్ పరీక్ష మంగళవారం జరగగా పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ఆ వెంటనే ఎన్ క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే దీనిపై టెలిగ్రామ్ కూడా స్పందించింది. పేపర్ లీక్‌తో సంబంధం ఉన్న ఛానళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Advertisement

Also Read: తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. నీట్ పేపర్ లీకేజీకి కారణం ఆయనే..

పరీక్షా పత్రాలకు సంబంధించిన అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన ఛానళ్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. దేశ చట్టాలకు లోబడి దర్యాప్తుకు సహకరిస్తామని వెల్లడించింది. లీకేజీ వ్యవహారంలో సోషల్ మీడియా సంస్థలపై విమర్శలు రావడంతో టెలిగ్రామ్ ఈ విధంగా స్పందించింది. లీక్ అయిన ప్రశ్నా పత్రం అసలు పేపర్‌తో సరిపోలిందని ఇప్పటికే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యూజీసీ నెట్ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేసథ్యంలోనే నెట్ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను కూడా త్వరలో ప్రకటించనున్నారు.

Tags

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×