E-Paper
Advertisement

UGC-NET: పేపర్ లీక్ చేసిన ఛానళ్లను బ్లాక్ చేసిన టెలిగ్రామ్

UGC-NET: పేపర్ లీక్ చేసిన ఛానళ్లను బ్లాక్ చేసిన టెలిగ్రామ్

UGC- NET: యూజీసీ నెట్ పేపర్ లీక్‌పై టెలిగ్రామ్ స్పందించింది. పేపర్ లీక్‌లో పాలు పంచుకున్న ఛానళ్లను బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించింది. అధికారులు చేస్తున్న విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ప్రశ్నా పత్రాలకు సంబంధించిన అనధికార కాపీలను సర్క్యులేట్ చేసిన ఛానళ్లను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు ప్రకటించింది.

నీట్ పేపర్ లీక్ వ్యవహారం, అదే సమయంలో నెట్ పరీక్ష రద్దు కావడం వంటి అంశాలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. యూజీసీ నెట్ పరీక్ష మంగళవారం జరగగా పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ఆ వెంటనే ఎన్ క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే దీనిపై టెలిగ్రామ్ కూడా స్పందించింది. పేపర్ లీక్‌తో సంబంధం ఉన్న ఛానళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Also Read: తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. నీట్ పేపర్ లీకేజీకి కారణం ఆయనే..

పరీక్షా పత్రాలకు సంబంధించిన అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన ఛానళ్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. దేశ చట్టాలకు లోబడి దర్యాప్తుకు సహకరిస్తామని వెల్లడించింది. లీకేజీ వ్యవహారంలో సోషల్ మీడియా సంస్థలపై విమర్శలు రావడంతో టెలిగ్రామ్ ఈ విధంగా స్పందించింది. లీక్ అయిన ప్రశ్నా పత్రం అసలు పేపర్‌తో సరిపోలిందని ఇప్పటికే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యూజీసీ నెట్ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేసథ్యంలోనే నెట్ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను కూడా త్వరలో ప్రకటించనున్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×