E-Paper
Advertisement

PM- KISAN : పీఎం కిసాన్‌ పథకం.. నిధులపెంపుపై కేంద్రం క్లారిటీ..

PM- KISAN : పీఎం కిసాన్‌ పథకం.. నిధులపెంపుపై కేంద్రం క్లారిటీ..
Advertisement

PM Kisan Scheme : పీఎం కిసాన్‌ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే ఆలోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేసింది. పీఎం కిసాన్ పథకం కింద నిధుల మొత్తాన్ని పెంచుతారంటూ గత కొన్ని రోజుల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్‌లో ఆ మేరకు ప్రకటన ఉంటుందన్న ప్రచారమూ జరిగింది. కానీ అలాంటిదేమీ లేకుండానే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగం ముగిసింది. తాజాగా పార్లమెంట్‌ వేదికగా పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచనేదీ లేదంటూ కేంద్రం స్పష్టతనిచ్చింది.

Advertisement

లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్‌ మొత్తాన్ని ఏడాదికి రూ.8 వేలు నుంచి రూ.12 వేలకు పెంచే ఉద్దేశమేదీ లేదని ఆయన స్పష్టంచేశారు. మహిళా రైతులకు కూడా పెంచే ఆలోచన లేదన్నారు. 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ.2.81 లక్షల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.

పీఎం-కిసాన్‌ అందుకున్న రైతుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 2.62 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. దీనిద్వారా ఏపీ నుంచి 43 లక్షలు, తెలంగాణ నుంచి 30 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రూ.6 వేలు రైతులకు అందిస్తున్నారు.

Tags

Related News

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

Big Stories

Advertisement
×