BigTV English
Advertisement

Trek Accident: హిమాలయాల్లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 9మంది బెంగళూరు వాసులు మృతి

Trek Accident: హిమాలయాల్లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 9మంది బెంగళూరు వాసులు మృతి

Trek Accident:ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లిన బృందం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలుత నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మృతులంతా బెంగళూరు వాసులుగా గుర్తించారు. మొత్తం 22 మందితో కూడిన ట్రెక్కింగ్ బృందం మే 29న హిమాలయాల్లోని 4,400 మీటర్ల ఎత్తున ఉన్న సహస్త్రతాల్ సరస్సు వద్దకు బయలుదేరారు. ట్రెక్కింగ్ పూర్తి చేసుకున్న ఈ బృందం తిరిగి బేస్ క్యాంప్ వద్దకు చేరుకోలేదు. దీంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సమాచారం అందించారు.


13మందిని కాపాడారు..

ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయక చర్యలు చేపట్టింది. మొత్తం 22 మందిలో 9 మంది మృతి చెందగా.. ఇప్పటికే చిక్కుకున్న 13మందిని కాపాడారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 19 మంది, మరో ముగ్గురు స్థానిక గైడ్స్‌తో కలిసి ఉత్తరకాశీ నుంచి హిమాలయ పర్వతాల్లోని సహస్త్రతాల్ సరస్సు ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీంతో మాట్లాడుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కాగా, ఇప్పటికే మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపింది.


Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×