BigTV English
Advertisement

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు, 36 మంది మృతి

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు, 36 మంది మృతి

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 36 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. మరో 20 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.


ఉత్తరాఖండ్‌లోని అల్మోర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పౌరి నుండి రామ్‌నగర్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఆల్మోరా స్టాల్ ప్రాంతంలోకి రాగానే అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.

ఘటన సమయంలో బస్సులో 45 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందగానే సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి పోలీసులు టీమ్, ఏస్డిఆర్ఎఫ్ బృందాలు. గాయపడినవారిని తొలుత ట్రీట్‌మెంట్ చేశారు. అనంతరం మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి.


బస్సు ప్రమాదంపై స్పందించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.

ALSO READ: సైన్యం వ్యూహం అదుర్స్.. బిస్కెట్లతో ఉగ్రవాది హతం

అవసరమైతే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను కోసం ఎయిర్ లిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. బస్సు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని కమిషనర్‌ని ఆదేశించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి.

 

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×