E-Paper
Advertisement

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు, 36 మంది మృతి

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు, 36 మంది మృతి
Advertisement

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 36 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. మరో 20 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లోని అల్మోర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పౌరి నుండి రామ్‌నగర్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఆల్మోరా స్టాల్ ప్రాంతంలోకి రాగానే అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.

Advertisement

ఘటన సమయంలో బస్సులో 45 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందగానే సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి పోలీసులు టీమ్, ఏస్డిఆర్ఎఫ్ బృందాలు. గాయపడినవారిని తొలుత ట్రీట్‌మెంట్ చేశారు. అనంతరం మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి.

బస్సు ప్రమాదంపై స్పందించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.

Advertisement

ALSO READ: సైన్యం వ్యూహం అదుర్స్.. బిస్కెట్లతో ఉగ్రవాది హతం

అవసరమైతే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను కోసం ఎయిర్ లిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. బస్సు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని కమిషనర్‌ని ఆదేశించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి.

 

Related News

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

Big Stories

Advertisement
×