E-Paper
Advertisement

Vande Bharat Express : హైదరాబాద్ నుంచి మరో వందే భారత్ సర్వీస్.. మూడో రైలు ఆ టెక్ సిటీకి..?

Vande Bharat Express : హైదరాబాద్ నుంచి మరో వందే భారత్ సర్వీస్.. మూడో రైలు ఆ టెక్ సిటీకి..?
Advertisement

Vande Bharat Express : హైదరాబాద్ లో మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రాబోతోంది. బెంగళూరుకు సర్వీస్ నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య కొత్త వందే భారత్‌ రైలు ప్రారంభించారు. ఈ సమయంలో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వందే భారత్‌ రైలు నడిపే అంశాన్ని స్థానిక బీజేపీ నేతలతో ప్రస్తావించారని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి ఈ సర్వీసు నడుస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి విశాఖ, తిరుపతికి సర్వీసులు నడుస్తున్నాయి.

ఇప్పటికే కాచిగూడ నుంచి బెంగళూరుకు పలు రైళ్లు నడుస్తున్నాయి. 570 కి.మీల ప్రయాణానికి కనీసం 11 గంటల సమయం పడుతోంది. అదే సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 4గంటలు తగ్గుతుంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు వందే భారత్‌ రైలు నడిపే అంశంపై జనవరిలోనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచనలు చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Advertisement

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు వందే భారత్‌ రైలు గురించి ప్రచారంలో ప్రస్తావిస్తున్నారని సమాచారం. దేశంలో ముఖ్యమైన టెక్‌ హబ్‌లుగా ఉన్న హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీసు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి పుణెకు మరో వందే భారత్ రైలును నడుపుతారనే వార్తలు వినపడుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 13 వందే భారత్‌ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.

ఈ ఏడాది జనవరి 14న సికింద్రాబాద్‌- విశాఖ వందేభారత్‌ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. తాజాగా ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌ వచ్చి తిరుపతి సర్వీసుకు పచ్చజెండా ఊపారు. బెంగళూరు సర్వీస్ ప్రారంభమైతే హైదరాబాద్ నుంచి మూడో వందే భారత్ రైలు అందుబాటులో ఉంటుంది.

Related News

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×