Krithi Shetty: ఒక్క సినిమా చాలు ఎవరినైనా ఓవర్ నైట్లో స్టార్ని చేయడానికి. అలాంటి లక్కున్న హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చిన తొలి సినిమాతోనే ఓవర్నైట్లో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇందులో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఉప్పెన మూవీ తర్వాత 2021లోనే నానితో ‘శ్యామ్సింగరాయ్’ మూవీ చేసింది.

ఆ తర్వాత 2022లో వరుసగా నాగ చైతన్యతో ‘బంగార్రాజు’ చేసింది. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత అదే ఏడాదిలో సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా చేసింది. ఇది పెద్దగా అలరించలేకపోయింది.

ఆపై అదే ఏడాది రామ్ పోతినేనితో ‘ది వారియర్’ మూవీలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

అలాగే అదే ఏడాదిలో నితిన్తో ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలో హీరోయిన్గా నటించింది. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.

ఇక 2023లో మరోసారి నాగచైతన్యతో జతకట్టింది. ‘కస్టడీ’ మూవీ చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా అలరించలేకపోయింది.

ఇలా వరుస అపజయాలతో బేబమ్మ వెనక్కి నెట్టవేయబడింది.

ఇప్పుడు మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఓ సినిమా చేస్తుంది. ఇందులో భాగంగానే కేరళలో ఓణం పండుగ సందర్భంగా కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.