E-Paper
Advertisement

Gambhir-Kohli: గంభీర్ డౌన్ డౌన్ అంటూ ఫ్యాన్స్‌ నినాదాలు..మైండ్ దొబ్బిందా అంటూ కోహ్లీ వార్నింగ్

Gambhir-Kohli: గంభీర్ డౌన్ డౌన్ అంటూ ఫ్యాన్స్‌ నినాదాలు..మైండ్ దొబ్బిందా అంటూ కోహ్లీ వార్నింగ్

Gambhir-Kohli:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారంతో వన్డే సిరీస్ ఫినిష్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 వన్డేల సిరీస్ ను కోల్పోయింది టీమిండియా. దీంతో గౌతమ్ గంభీర్ పైన దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం ఆరు సిరీస్ లు టీమిండియా కోల్పోయిందని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇందులో భాగంగానే ఇండోర్ వేదికగా గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

గంభీర్ కు వ్యతిరేకంగా నినాదాలు.. వార్నింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ

న్యూజిలాండ్ చేతిలో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కు కొత్త టెన్షన్ మొదలు అయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి వచ్చే ప్రెషర్ కంటే… టీమిండియా అభిమానుల నుంచి వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఇండోర్ వేదికగా మూడవ వన్డే పూర్తయిన తర్వాత ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది బీసీసీఐ. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు టీమిండియా అభిమానులు. ఇండోర్ స్టేడియానికి వచ్చిన అభిమానులు రెచ్చిపోయి… గౌతమ్ గంభీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే అక్కడే ఉన్న గౌతమ్ గంభీర్, టీమిండియా స్టాప్, హర్షిత్, నితీష్ కుమార్ రెడ్డి, శ్రేయాస్ అయ్యర్ ఈ నినాదాలు విన్నారు. అటు విరాట్ కోహ్లీ కూడా అక్కడే ఉన్నాడు. గౌతమ్ గంభీర్ కు వ్యతిరేకంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ జోక్యం చేసుకున్నాడు. స్టేడియంలో నిలుచొని… అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అసలు మీకు మైండ్ దొబ్బిందా..? గౌతమ్ గంభీర్ ను ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అని ఫైర్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ మేరకు స్టేడియం నుంచే సైగలు చేశాడు. అయినా కూడా గంభీర్ కు నెగిటివ్ గా నినాదాలు చేశారు జనాలు. దీంతో ఒక గౌతమ్ గంభీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన వీడియో వైరల్ గా మారింది.

రేపటి నుంచి టి20 సిరీస్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటికే వన్డే సిరీస్ పూర్తయింది. ఈ సిరీస్ న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు టి20 ఫార్మాట్ కోసం టీమిండియా అలాగే న్యూజిలాండ్ సిద్ధమైంది. రేపటి నుంచి 5 టీ20 ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్సయిన సంగతి తెలిసిందే. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు ముందు ప్రాక్టీస్ లాగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది. ఇది గెలిచి ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో దుమ్ము లేపాలని టీమ్ ఇండియా భావిస్తోంది.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×