Ranbir Kapoor-RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament) సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bengaluru ) కొత్త ఓనర్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టును విక్రయించేందుకు సిద్ధమైంది డియాజియో (Diageo). వచ్చే సీజన్ ప్రారంభమయ్యే సమయానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ వస్తాడని ఇప్పటికే నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కొనుగోలు చేయబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే పూర్తిగా ఆ జట్టును కొనుగోలు చేయకుండా కేవలం ఎనిమిది శాతం ఓనర్ షిప్ కోసం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 300 కోట్లు ఖర్చు చేస్తున్నాడట. అయితే మొత్తం షేర్లను ఎవరు కొనుగోలు చేస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ఈ RCB జట్టును కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైనల్..ఇక మనోళ్లను ఆపడం కష్టమే
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నువ్వు కొనుగోలు చేసేందుకు దాదాపు రెండు బిలియన్ డాలర్లు అవసరం. అంటే 1700 కోట్లనుంచి 1800 కోట్లు ఇండియన్ రూపాయలలో అవసరం. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను ( Royal Challengers Bengaluru ) కొనుగోలు చేసేందుకు చాలామంది పోటీలో ఉన్నారు.
నిఖిల్ కామత్, జెఎస్ డ్లూ గ్రూప్ , ఆదార్ పూనా వాలా , అంబానీ ఫ్యామిలీ ( Ambani Family) కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధమైందట. అయితే ఇందులో 8% వాటాను కొనుగోలు చేసేందుకు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ( Bollywood Ranbir Kapoor ) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ఎనిమిది శాతం వాటాలు కొనుగోలు చేయాలన్నా కూడా 300 కోట్లు అవసరమని తెలుస్తోంది. దీంతో ఆ 300 కోట్లు సిద్ధం చేసుకున్నాడట ఈ బాలీవుడ్ హీరో రణబీర్ సింగ్. ఎవరు కొనుగోలు చేసినా కూడా 8% వాటా కొనేసేందుకు రెడీగా ఉన్నాడట. ఇది ఇలా ఉండగా, 2025 టోర్నమెంట్ ( IPL 2025) సమయంలో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ గెలుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bengaluru ). దీంతో 18 ఏళ్ల తర్వాత టైటిల్ గెలుచుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇక ఈ సారి కూడా టైటిల్ గెలిచేలా బలంగానే ఆర్సీబీ జట్టు ఉంది.
RCB new owner :
According to reports bollywood star Ranbir Kapoor is all set to buy 8 percent of RCB stake.
Ranbir is putting 2 percent in cash which is around 300 crores and remaining 6 is sweat equity. pic.twitter.com/gmUdmbnBbe
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) January 18, 2026