BigTV English

Paris Olympics 2024: పారా ఒలింపిక్స్..పీవీ సింధు విజయం

Paris Olympics 2024: పారా ఒలింపిక్స్..పీవీ సింధు విజయం

Paris Olympics 2024: పారా ఒలింపిక్స్ లో భాగంగా తన తొలి మ్యాచ్‌లోనే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం సాధించింది. ఈ పోటీల్లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు గెలిచింది. గ్రూప్ స్టేజీలో మాల్దీవులకు చెందిన ఫాతిమా నమాన అబ్దల్ రజాఖ్‌పై ఆమె విజయం సాధించింది. ఈ మేరకు 21-9, 21-6 తేడాతో పీవీ సింధు సునాయసంగా గెలిచి శుభారంభం చేసింది.


అయితే మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్..సింధుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో వరుస గేమ్‌ల్లో సింధు గెలిచింది. కేవలం 29 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇక సింధు.. తన రెండో గ్రూప్ ఎం మ్యాచ్‌లో జూలై 31న బుధవారం ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కుబాతో తలపడనుంది.

ఇదిలా ఉండగా, పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు దూసుకెళ్తోంది. ఇప్పటికే ఒక రజత పతకంతోపాటు మరో కాంస్య పతకం సాధించింది. అయితే వరుసగా రెండు పతకాలను తన ఖాతాలో వేసుకున్న సింధు మూడో పతకంపై కన్నేసింది. 2016లో రజత పతకం, 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. పారిస్ లోనూ పతకం సాధిస్తే.. వరుసగా మూడు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా సింధు రికార్డు సృష్టించనుంది.


Related News

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Big Stories

×