E-Paper
Advertisement

Policeman Son Steals Car | దొంగతనం జరిగిన కారు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభ్యం!.. ఏం జరిగిందంటే?

Policeman Son Steals Car | దొంగతనం జరిగిన కారు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభ్యం!.. ఏం జరిగిందంటే?
Advertisement

Policeman Son Steals Car | శుక్రవారం అర్ధరాత్రి క్రేటా కారులో వెళుతున్న ఓ వక్తిని దారిలో ముగ్గురు దుండగులు అడ్డగించారు. ఆ తరువాత అతడి తలపై బలంగా కొట్టి.. తుపాకులు చూపించి కారుని దొంగలించారు. కారు యజమాని దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు 24 గంటల్లోనే ఆ ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. కానీ ఆ కారు వారికి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభించింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని భటిండా నగరంలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. భటిండా నగరం మోడల్ టౌన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వికాస్ శర్మ, అమన్ చావ్లా, దీపక్ శర్మ.. ఈ ముగ్గురు కలిసి దారిలో వెళుతున్న కొత్త క్రేటా కారుని అడ్డగించారు. ఆ తరువాత కారు డ్రైవర్ ని తమ వద్ద ఉన్న తుపాకులు చూపించి బెదిరించి.. బయటికి రమ్మన్నారు. కారు డ్రైవర్ బయటకు రాగానే అతని తలపై బలంగా కొట్టి కారు తీసుకెళ్లిపోయారు. ఆ కారు డ్రైవర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయగానే పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ వాహనం అక్కడకు చేరుకొని.. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది.

Advertisement

Also Read: సొంత కొడుకునే దత్తత తీసుకునేందుకు అనుమతి కోరిన మహిళ.. సుప్రీం కోర్టులో విచిత్ర కేసు

పోలీసులు కారు దొంగతనం ఫిర్యాదు నమోదు చేసుకొని.. కారులోని జిపిఎస్ ఆధారంగా ట్రాక్ చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం కారుని ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని.. కారుని సీజ్ చేశారు. ఆ తరువాత ఆ ఇంటి ఓనర్.. మాజీ పోలీస్ ఆఫీసర్ విజయ్ కుమార్ అని తెలియడంతో వారు ఆశ్చర్యపోయారు. దీంతో దొంగలను పట్టుకోవడానికి విచారణ చేయగా.. కారు దొంగతనం చేసిన ముగ్గురిలో ఇద్దరు ఆయన కుమారులే అని తెలిసింది.

Advertisement

దీంతో పోలీసులు ఆఫీసర్ విజయ్ కుమార్ ఇద్దరు కొడుకులు వికాస్ శర్మ, దీపక్ శర్మతో పాటు వారి స్నేహితుడు అమన్ చావ్లాని కూడా అరెస్టు చేశారు.

Also Read: లండన్ వీసా మాయలో మోసపోయిన మహిళ.. డబ్బులు దోచుకొని సామూహిక అత్యాచారం చేసిన ఏజెంట్లు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×