BigTV English
Advertisement

T20 World Cup 2024 Final: జయహో భారత్.. రోహిత్ సేనాకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు

T20 World Cup 2024 Final: జయహో భారత్.. రోహిత్ సేనాకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు

Political Leaders Congratulates Team India On Majestic Win In WC 2024 Finals: టీ 20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా టీమ్ ఇండియా గెలిచింది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను ఓడించి.. ట్రోఫీని ముద్దాడింది. కోట్లాదిమంది భారతీయులకు అపరిమితమైన సంతోషాన్ని ఇచ్చింది. వారి మనసులను ఉప్పొంగేలా చేసింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ సేనాకు పలవురు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.


ఉత్కంఠపోరులో రోహిత్ సేనా టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మ్యాచ్ తో పాటు హృదయాలను గెలిచారని మోదీ కొనియాడారు.

రాష్ట్రపతి ద్రైపది ముర్ము, విపక్షనేత రాహుల్ గాంధీ, టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు రాహుల్ గాంధీ.. అదో బ్రిలియంట్ క్యాచ్ అని మ్యాచ్ ను మలుపు తిప్పిన క్యాచ్ అని అన్నారు. ఇక కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మను రాహుల్ గాంధీ ఆకాశానికి ఎత్తేశారు. రోహిత్ గ్వైడెన్స్ ను టీమ్ ఇండియా చాలా ఫార్మాట్ లలో మిస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి భారత్ గర్వపడేలా చేశారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇక టీమ్ ఇండియాకు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన తీరు అభినందనీయం అని తెలిపారు. వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమ్ ఇండియా దేశ ప్రజలను గర్వించేలా చేసిందన్నారు సీఎం. ఈ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ప్రంపంచ క్రికెట్ లో భారత్ కు ఎదురులేదని మరో సారి నిరూపించందని రేవంత్ రెడ్డి కొనియాడారు.

Also Read: హై ఓల్టేజ్ ఫైనల్ లో జయం మనదే.. టీ 20 ప్రపంచకప్ విజేతగా టీమ్ ఇండియా

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను రోహిత్‌సేనా సాకారం చేసిందన్నారు. దేశాన్ని ఆనందోత్సవాల్లో ముంచెత్తినందుకు టీమ్ ఇండియాకు కృతఙ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. భారత ఖ్యాతిని మరింత పెంచారని కొనియాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి హరీశ్ రావు, సినీ హీరో మంచు విష్ణు అభినందనలు తెలియజేశారు. ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. సమిష్ట కృషితో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించిందన్నారు.

Tags

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×