BigTV English

T20 World Cup 2024 Final: జయహో భారత్.. రోహిత్ సేనాకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు

T20 World Cup 2024 Final: జయహో భారత్.. రోహిత్ సేనాకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు

Political Leaders Congratulates Team India On Majestic Win In WC 2024 Finals: టీ 20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా టీమ్ ఇండియా గెలిచింది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను ఓడించి.. ట్రోఫీని ముద్దాడింది. కోట్లాదిమంది భారతీయులకు అపరిమితమైన సంతోషాన్ని ఇచ్చింది. వారి మనసులను ఉప్పొంగేలా చేసింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ సేనాకు పలవురు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.


ఉత్కంఠపోరులో రోహిత్ సేనా టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మ్యాచ్ తో పాటు హృదయాలను గెలిచారని మోదీ కొనియాడారు.

రాష్ట్రపతి ద్రైపది ముర్ము, విపక్షనేత రాహుల్ గాంధీ, టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు రాహుల్ గాంధీ.. అదో బ్రిలియంట్ క్యాచ్ అని మ్యాచ్ ను మలుపు తిప్పిన క్యాచ్ అని అన్నారు. ఇక కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మను రాహుల్ గాంధీ ఆకాశానికి ఎత్తేశారు. రోహిత్ గ్వైడెన్స్ ను టీమ్ ఇండియా చాలా ఫార్మాట్ లలో మిస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి భారత్ గర్వపడేలా చేశారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇక టీమ్ ఇండియాకు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన తీరు అభినందనీయం అని తెలిపారు. వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమ్ ఇండియా దేశ ప్రజలను గర్వించేలా చేసిందన్నారు సీఎం. ఈ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ప్రంపంచ క్రికెట్ లో భారత్ కు ఎదురులేదని మరో సారి నిరూపించందని రేవంత్ రెడ్డి కొనియాడారు.

Also Read: హై ఓల్టేజ్ ఫైనల్ లో జయం మనదే.. టీ 20 ప్రపంచకప్ విజేతగా టీమ్ ఇండియా

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను రోహిత్‌సేనా సాకారం చేసిందన్నారు. దేశాన్ని ఆనందోత్సవాల్లో ముంచెత్తినందుకు టీమ్ ఇండియాకు కృతఙ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. భారత ఖ్యాతిని మరింత పెంచారని కొనియాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి హరీశ్ రావు, సినీ హీరో మంచు విష్ణు అభినందనలు తెలియజేశారు. ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. సమిష్ట కృషితో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించిందన్నారు.

Tags

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×