E-Paper
Advertisement

Car: బిర్యానీ కావాలని.. డ్రైవర్‌కు మస్కా.. కారు చోరీ..

Car: బిర్యానీ కావాలని.. డ్రైవర్‌కు మస్కా.. కారు చోరీ..
car theft

Car: బిర్యానీ కావాలని క్యాబ్ డ్రైవర్‌ని హోటల్‌కి పంపిన ఓ ప్రయాణీకుడు.. కారుతో సహా పరారైన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. హైదరాబాద్‌కు వెళ్లాలంటూ.. ఓ ప్రయాణీకుడు జహీరాబాద్ లో క్యాబ్ ఎక్కాడు. కారు పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్దకు రాగానే తనకు ఆకలేస్తోందంటూ క్యాబ్ డ్రైవర్ కు చెప్పాడు. ఓ హోటల్ దగ్గర ఆపి బిర్యానీ తేవాలంటూ డ్రైవర్ ను పంపించాడు.

ప్రయాణీకుడి మాటలు నమ్మిన డ్రైవర్.. బిర్యానీ కోసం హోటల్ లోకి వెళ్లాడు. డ్రైవర్ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ప్రయాణీకుడు వెంటనే కారును తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి హోటల్ నుంచి బయటకు వచ్చిన క్యాబ్ డ్రైవర్.. కారు కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దొంగను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×