BigTV English

CM KCR: తెలంగాణలో మరో కొత్త పథకం.. కేసీఆర్ కీలక కసరత్తు..

CM KCR: తెలంగాణలో మరో కొత్త పథకం.. కేసీఆర్ కీలక కసరత్తు..


CM KCR: ఏ ముహూర్తాన కొత్త సచివాలయంలో అడుగుపెట్టారో కానీ.. అప్పటి నుంచీ అన్నీ మంచి విషయాలే వినిపిస్తున్నాయి. కీలక ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పోడుభూముల పంపిణీ నుంచి పారిశుద్ద కార్మికుల జీతాల పెంపు వరకు.. చాలానే గుడ్‌న్యూస్‌లు చెప్పారు. లేటెస్ట్‌గా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మరో కొత్త పథకానికి నిర్ణయం తీసుకున్నారు.

రైతు బీమా. రైతు బంధులానే ప్రతిష్టాత్మక పథకం. అన్నదాత అకస్మాత్తుగా చనిపోతే.. ఆ కుటుంబానికి వెంటనే 5 లక్షల పరిహారం అందివ్వడం. చనిపోయిన రైతు కుంటుంబానికి ఎంతో దన్నుగా నిలుస్తోందీ పథకం. సేమ్ టు సేమ్ ఇలాంటి పథకమే.. గౌడన్నలకు కూడా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రైతు బీమా తరహాలోనే.. కల్లుగీత కార్మికులకు ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.


కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విధివిధానాలపై కొత్త సచివాలయంలో గీత కార్మికుల బీమా పథకంపై మంత్రులు, అధికారులతో చర్చించారు సీఎం కేసీఆర్. వారం రోజుల్లోనే బీమా సొమ్ము అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×