Padi Kaushik reddy latest news(Political news in telangana):
పంచాయతీ కార్యదర్శిని బెదిరించారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. డ్రామాలు, తమాషాలు చేస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజకీయం చేయాలని హితవు పలికారు. పద్ధతి మార్చుకోవాలని చిందులు వేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
- Advertisement -
కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే రాకముందే భవనాన్ని బీఆర్ఎస్ సర్పంచ్ మాట్ల రవీందర్ ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. కానిపర్తి పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ పై చిందులేశారు. ఈ తతంగాన్ని గమనించిన ప్రజలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.
- Advertisement -
- Advertisement -