BigTV English

Pawan Kalyan : తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.. పవన్ కల్యాణ్ పిలుపు..

Pawan Kalyan : తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.. పవన్ కల్యాణ్ పిలుపు..

Pawan Kalyan : తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండోరోజు కొత్తగూడెం బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్న బీజేపీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.


బీజేపీతో పొత్తు కోసం 26 మంది జనసైనికులు త్యాగం చేశారని తెలిపారు. తనకు తెలంగాణలో అన్ని పార్టీల నాయకులతో పరిచయాలు ఉన్నాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ తో పరిచయం ఉన్నా.. తన మద్దతు బీజేపీకేనని తేల్చిచెప్పారు. బీజేపీ, జనసేన తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో దోపిడీ జరిగిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కౌలు రైతులను చులకనగా చూడటం సరికాదన్నారు. గత పాలకులు చేసిన తప్పే ఇప్పుడు మళ్లీ జరుగుతోందన్నారు. కొత్తగూడెంలో ఉపాధి అవకాశాలేవన్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి జరుగుతోందని వివరించారు.


నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని పవన్ అన్నారు. నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేశారని గుర్తు చేశారు. నేడు పేపర్ల లీకులతో ఎంతోమంది నిరుద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే యువతకు జనసేన అండగా నిలబడుతుందన్నారు.

.

.

.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Big Stories

×