ABP C Voter Survey Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడప్పుడే గడ్డ పరిస్థితులు తీరేటట్లు లేవు. మరి కొన్ని నెలల్లో జరుగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ టీమ్కు కష్టాలు తప్పవని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.
ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెలలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశలున్నాయి. దీంతో తాజాగా ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఓపీనియన్ పోల్ ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాలు బీఆర్ఎస్కు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజక వర్గాలుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి స్థానాల్లో విజయం సాధిస్తుందని, కేసీఆర్ గులాబీ పార్టీకి 3 నుంచి 5 సీట్లు మాత్రమే లభించే అవకాశాలున్నాయి. బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఈ ఒపీనియన్ పోల్ సర్వేలో బిజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎంఐఎం, కమ్యూనిస్టులు, స్వతంత్ర అభ్యర్థులకు 1 లేదా రెండు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో తేలింది. మరో విషయం లేమిటంటే కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వే అంచనా.
ఈ సర్వే ఫలితాలతో బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడిలో పడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికలకు ఎంపీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను పరిశీలించి వాటిని అధిగమించేకు కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ బీజేపీకి ఈ ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా.. జాతీయ స్థాయిలో మాత్రం మోదీ నాయకత్వంలోని బీజేపీకే మళ్లీ అధికారం దక్కే అవకాశాలున్నాయని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.
ABP C Voter Survey, Telangana, BRS, humiliation, Lok Sabha polls, Congress, Revanth Reddy,