E-Paper
Advertisement

Revanth Reddy : కాంగ్రెస్ హామీలతో కేసీఆర్ కు ఓటమి భయం.. అందుకే కొత్త పథకాలు : రేవంత్

Revanth Reddy : కాంగ్రెస్ హామీలతో కేసీఆర్ కు ఓటమి భయం.. అందుకే  కొత్త పథకాలు : రేవంత్
Advertisement

Revanth Reddy : తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న రేవంత్‌ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌ ఇస్తున్న హామీలతో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని రేవంత్ అన్నారు. అందుకే ఇప్పుడు హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సరికొత్త సంక్షేమ పథకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నియంతృత్వ వైఖరి అనుసరిస్తున్నారని రేవంత్ విమర్శలు గుప్పించారు.

Advertisement

మరోవైపు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉందని ఓ కార్యక్రమంలో జరిగిన చిట్ చాట్ లో రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. దామాషా ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసన్నారు. కాంగ్రెస్‌ చిత్తశుద్ధిపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి వకాల్తాలు తమకు అవసరం లేదన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×