IndiGo flight: నిన్న ఎయిరిండియా.. నేడు ఇండిగో విమానం ఆకాశం నుంచి సడన్గా ల్యాండింగ్ అవుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి గోవా ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అసలు విమానంలో ఏం జరిగింది?
మంగళవారం ఉదయం 9.16 గంటలకు గోవా నుంచి ఢిల్లీకి ఇండిగో నంబర్ 6E 2102 విమానం బయలు దేరింది. గాలిలో ఉండగా ఇంజన్ సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానం 14 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. పరిస్థితి గమనించిన గోవా ఎయిర్ పోర్టు కంట్రోల్తో మాట్లాడారు. దీని కారణంగా గోవాలోని మోపా ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఫ్లైట్రాడార్24 అనే విమానయాన ట్రాకర్ నుండి అందిన సమాచారం ప్రకారం.. ఆ విమానం దక్షిణ మహారాష్ట్ర తీరం మీదుగా గోవా వైపు మళ్లి తిరిగి గోవా ఎయిర్ పోర్టుకు చేరింది. విమానం గోవా వైపు మళ్ళినప్పుడు సమయం విమానం ఉదయం 9:51 గంటలకు రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. స్టాండ్ 6 వద్ద దాన్ని పార్క్ చేశారు. ఆ తర్వాత ఉదయం 10:03 గంటలకు ఏటీసీ పూర్తి అత్యవసర పరిస్థితిని ముగించింది. ఢిల్లీకి బయలుదేరే విమానం సమయాన్ని మధ్యాహ్నం 3:30 గంటలకు మార్చారు సంబంధిత అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: టిష్యూ పేపర్ ఎంత పని చేసింది? ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?