Gundeninda GudiGantalu Today episode April 20th: మనోజ్ ఫ్రెండు అప్పుడే అక్కడికి రావడంతో ఆ గుడ్లను చూసిన నీలకంఠం ఒక స్వామీజీ తెలుసు అతని మనం కలవాలి అనేసి అంటాడు. ఇక రోహిణి మనోజ్ నీలకంఠ ముగ్గురు కలిసి ఆ స్వామిజి దగ్గరికి వెళ్లాలని అనుకుంటారు. అతని దగ్గరికి వెళ్ళగానే నా షాప్ ముందర ఈ గుడ్లు ఉన్నాయి అని మనోజ్ చెప్పగానే వాటిని చూసి నా స్వామీజీ షాక్ అవుతాడు. ఎదుగుదలని తట్టుకోలేక వీటిని నీ షాప్ ముందు పడేశారు. ఎలాగైనా సరే వీటిని నువ్వు ముట్టుకున్నావు కాబట్టి నీకు ఏదైనా జరగొచ్చు అందుకు నేను చెప్పినట్లు చేయాలి అని అతను చెప్పగానే మనోజ్ సరే అని అంటాడు. ఇక మనోజ్ కి గుడిలో చేయాల్సిన పరిహారం గురించి స్వామీజీ చెప్పగానే మనోజ్ సరే అంటాడు.
గుడ్డు గురించి స్వామీజీ దగ్గరకు వెళ్లిన మనోజ్ కి ఆయన చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే పరిహారం చెయ్యకపోతే ప్రాణాలు పోతాయి అని చెప్పగానే తప్పక మనోజు ఒప్పుకుంటాడు.. మీరు మీ అమ్మతో కలిసి ఈ పరిహారం చేయాలి. లేదంటే మాత్రం కచ్చితంగా మీరు అలానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని ఆయన చెప్పగానే రోహిణి టెన్షన్ పడుతుంది. నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అని ఆ స్వామీజీ అడుగుతారు.. నాకు ఇష్టమైన మా అమ్మ అని చెప్పగానే రోహిణి మొదట కుళ్ళుకుంటుంది కానీ స్వామీజీ చెప్పిన పరిహారం విని షాక్ అవుతుంది. ఎలాగైనా సరే మా అమ్మతో ఈ పరిహారం చేయించాలి అని మనోజ్ ఇంటికి వెళ్తాడు..
ప్రభావతి దగ్గరికి వెళ్ళిన మనోజ్ ఈ విషయం గురించి తనకి చెప్తాడు. అయితే మొదట ఇంకేదో అనుకున్న కూడా ఆ తర్వాత మాత్రం ప్రభావతి నాకు తెలీదు పస్తులు ఉండాలి మిస్టర్ గా ఉండాలి అని ఏదేదో చెప్తుంది. కానీ చివరికి మనోజ్ కాళ్ళ మీద పడినా సరే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన సరే అస్సలు ప్రభావతి మాత్రం ఒప్పుకొని ఒప్పుకోదు. నావల్ల కాదు అని కిందకు వస్తూ ఉండగా తన ముందు ఫ్యాన్ కింద పడిపోయి విరిగిపోవడంతో కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఒప్పుకున్న పెళ్లికి తప్పక చస్తానా లేకపోతే చచ్చేలా ఉన్నాను అని ప్రభావతి పూజకు ఒప్పుకుంటుంది.. మనోజు హమ్మయ్య చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటాడు..
మీనాతో నవీన్ తమ్ముడు మాట్లాడిన విధానం గురించి బాలు తో చెప్తాడు. అయితే బాలు మాత్రం తన గురించి ఏమనుకుంటుందో అన్న విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు. ప్రేమలో పడితే అబద్ధాలు చెప్పాలి అప్పుడే ఆ ప్రేమ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని బాలు చెప్పిన క్లాస్ కి అతను ఫీదా అవుతాడు. కానీ బాలు మాత్రం మీనాన్ని ప్రేమిస్తున్న విషయాన్ని పసిగట్టలేక పోతాడు. మొత్తానికి అతను అనుకున్న విధంగానే బాలు చెప్పిన మాట విని అతనికి పిచ్చ ఫ్యాన్ అయిపోతాడు.
ఇక ఉదయం లేవగానే మోటర్ పని చేయలేదన్న విషయాన్ని బాలు మీనా తో చెప్తాడు. అందరూ కూడా బాత్రూంలో నీళ్లు రావడం లేదు అని అక్కడికొస్తారు. అయితే బాలు మోటార్ చెడిపోయిందని చెప్పగానే నిన్న బాగానే ఉన్న మోటర్ ఇప్పుడెలా చెడిపోయింది అని ప్రభావతి అంటుంది. ఇదే ఏదో ఒకటి చేసింది. మరి ఇప్పుడు నీళ్లు అందరికీ తినే తీసుకురావాలి అని చెప్పగానే బాలు నా పెళ్ళాం ఎందుకు తీసుకురావాలి? ఎవరికి వాళ్లే తెచ్చుకోవాలి అని అంటాడు.. ఇక మీనా కూడా నేనెందుకు తీసుకొస్తాను మీరే కదా తెచ్చుకున్నారు మీరే తీసుకోండి అని అంటుంది. బయట ట్యాంకర్ రావడంతో అందరూ అక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తారు కానీ శృతి నీళ్లు తీసుకురావడానికి చాలా సుకుమారంగా పెరిగి ఉంటుంది. రోహిణి మాత్రం ఎంతో చక్కగా బిందెను చంకలో పెట్టుకుని రావడంతో ప్రభావతికి అనుమానం వస్తుంది కానీ రోహిణి మాత్రం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.
మోటర్ ను రిపేర్ చేయించడానికి బాలు మెకానిక్ ని రమ్మని చెప్తాడు. అయితే మెకానిక్ రాగానే బాలుకి ఆ మోటర్ పరిస్థితిని వివరించి మెయిన్ ఆఫ్ చేసి వెళ్తాడు. కానీ మనోజ్ మాత్రం ఇంట్లో కరెంట్ లేదని మెయిన్ ఆన్ చేస్తాడు ప్రభావతి ఉక్కపోతగా ఉంది అని స్విచ్ ఆన్ చేయడానికి స్విచ్ బోర్డు దగ్గరికి వస్తుంది.. ప్రభావతికి కరెంట్ షాక్ కొట్టగానే కొట్టుకుంటూ ఉంటుంది అయితే కామాక్షి తో పాటుగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా కరెంట్ షాక్ తో కొట్టుకుంటూ ఉండగా మీనా కర్రతో కొట్టి అందరిని కాపాడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..