Gundeninda GudiGantalu Today episode February 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి ఇంట్లో ఉన్న పాత సామాన్లని దుప్పట్లని బయటపెడుతుంది.. ఏంటి ఎందుకు ఇవన్నీ బయట పెడుతున్నావు అని బాలు అడుగుతాడు.. లేదు మీ ఆవిడ లాగా ఓడిపోతుంది కదా అ పూల కంపెనీ పక్కన పెట్టేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ రోజు కడుగుతూ ఇంట్లోనే ఉండాలి అని అంటుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మీనా ఇవన్నీ ఏంటి ఇక్కడ పెట్టారు అని అడుగుతుంది. ఏంటి మౌనిక వాళ్ళని తీసుకొని వస్తానని శబదాలు చేశావు కదా రానన్నారా గెంటేసారా బయటికి తోసేసారా అని ప్రభావతి అడుగుతుంది.. మావయ్య గారు మీరు ఒకసారి అమ్మమ్మ గారికి ఫోన్ చేసి మౌనికకు వాళ్ళ ఆయనకు బట్టలు పెట్టాలి ఏమో అడగండి అని మీనా అంటుంది. మాట వినగానే ప్రభావతికి ఫీజులు ఎగిరిపోతాయి.. ప్రభావతి ఓడిపోయింది కాబట్టి మీనా గెలిచినట్లే పూలమ్మాల్సిందే అని బాలు అంటాడు.. ఇక అప్పుడు ఇంట్లోకి సుశీలమ్మ ఎంటర్ అవుతుంది..
అయితే అత్తయ్య మీరు వచ్చేసారా అని అనగానే సుశీల వచ్చి రాగానే ప్రభావతి పై సెటైర్లు వేస్తుంది.. సుశీల వచ్చిన తర్వాత బాలు రేపు నీకు ఒక విచిత్రం చెప్పబోతున్నాను అది చూసి నువ్వు తట్టుకోలేవు శీలా డార్లింగ్ అని అంటాడు.. అయితే షీలా నీ లోపలికి తీసుకోలేను నా బాలు శృతి మీనాల మధ్య నిజంగానే గొడవ జరిగిందా అని అడుగుతుంది.. మీనా బాలు ఇద్దరూ కలిసి నిజం చెప్తారు.. ఆ తర్వాత అందరూ కలిసి హోమం చేయడానికి అని అక్కడికి వెళ్తారు. బొమ్మల కొలువు చూసి అందరు సంతోషంగా ఉంటారు. కామాక్షి మాత్రం ఇండ్లు నా ఫ్రెండ్ దే అని గొప్పగా చెప్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… బాలు పోను ఎవరో కొట్టేసారని అనుకుంటూ ఉంటాడు.. బాలు మీన ఫోన్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. అయితే మీనాని ఒకసారి ఫోన్ చేయమని బాలు చెప్తాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా రోహిణి జాగ్రత్తపడుతుంది. నీకు ఆ తర్వాత బాలు ఫోన్ చేస్తున్నారని ఫోన్ ఎలాగైనా సరే దాచి పెట్టాలి అని అనుకుంటారు.. ఫోన్ ఎక్కడో చోట దొరుకుతుంది లే అని మీనా అంటుంది. సంజు, మౌనిక వచ్చేసారు పదండి ఒకసారి పలకరిద్దామని అయినా అంటుంది. మీరు అతన్ని బావగారు అని మర్యాదగా పలకరించండి అని నేను అంటుంది. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా సంజులి మర్యాదగా పలకరిస్తే అతను మాత్రం వెటకారంగా అంటుంటారు.. ఏంటి మీ వాళ్ళందరూ ఒకే డైలాగ్ ప్రాక్టీస్ చేశారా ఏంటి ఇలా నన్ను ఒకేసారి బాగున్నావా అని అడుగుతున్నారు అని మాట్లాడుతాడు.
బాలు బావగారు బాగున్నారా అని మర్యాదపూర్వకంగా అడుగుతాడు.. వాళ్లు అలా అడగడం చూసి సంజీవ్ షాక్ అవుతాడు. ఏంటి మీ అన్నయ్యకి ఏదో అయినట్లు ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడు ఏంటి అని మౌనికని అడుగుతాడు. మీతో గొడవ పడొద్దు అని మా ఇంట్లో వాళ్ళందరూ గట్టిగా చెప్పినట్లున్నారు అందుకే మా అన్నయ్య ఇలా మర్యాదగా మాట్లాడుతున్నారు అని మౌనిక అంటుంది.. ఆ తర్వాత ఏదో ఒకటి మాట్లాడండి అని మీనా అంటే కారు కండిషన్ లో ఉందా అని అడుగుతాడు. యాగం ఉంది అంటే వచ్చాను కానీ ఇలా కారు గురించి వాటి గురించి మాట్లాడతారు అని తెలిస్తే నేను అసలు వచ్చే వాడిని కాదు అని సంజయ్ అంటాడు.
Also Read : సాగర్ ను చూసి వేదవతి హ్యాపీ.. నర్మదను ఇరికించిన ప్రేమ.. రామారాజుకు నిజం తెలుస్తుందా..?
ఇక లోపలికి వెళ్ళిన బాలు సంజీవ్ ఎలా మాట్లాడాలి అన్నది మీనా చెప్పినా కూడా నాకు రావడం లేదే అని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న అద్దంలో మాట్లాడుకుంటూ ఉంటాడు. బాలు అంతరాత్మ బయటికి వచ్చి ఏం చేస్తున్నావ్ రా నీకు విరగొట్టడం తెలుసుగాని ఇలా మాట్లాడటం నీకు ఎలా తెలుస్తుంది అని అంటాడు.. ఇక తర్వాత బాలు ఎలాగైనా సరే సంజయ్ తో కూల్ గా మాట్లాడాలి అనుకుంటాడు.. సంజయ్ దగ్గర ఎలాగైనా సరే మార్కులు కొట్టేయాలని నన్ను క్షమించండి బావగారు.. మీ మనసు నచ్చుకునేలా నేను ఎప్పుడూ చేయను అని అంటాడు.. ఆ మాట వినగానే సంజయ్ షాక్ అవుతాడు. ఇక భోజనం ఏర్పట్ల దగ్గరికి సంజయ్ వెళ్తాడు అందరూ అతనికి మర్యాదగా భోజనం వడ్డిస్తారు. అది చూసి సంజయ్ ఏమైంది వీళ్ళందరికీ అని అనుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్రోహిణి అడ్డంగా దొరికిపోతుందా చూడాలి…