Illu Illalu Pillalu Today Episode February 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా సాగర్ ల ఉద్యోగం గురించి తెలియగానే శ్రీవల్లి, భాగ్యం ఇద్దరు కూడా ఎలాగైన సరే అన్ని బయట పెట్టాలని అనుకుంటారు. పార్టీ గురించి నర్మదా ఇంట్లో చెప్పగానే అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ శ్రీవల్లి నిజం చెప్పకబోతుంటే భాగ్యం మాత్రం అడ్డుకుంటుంది.. అయితే వేదవతి రామరాజు మాటకి బాధపడిపోతుంది.. నర్మదా నువ్వేం బాధపడకు నర్మదా నేను మీ మావయ్య గారిని ఒప్పించే పని చేస్తాను. కచ్చితంగా వస్తాను అని అంటుంది..
ఇక శ్రీవల్లి ఎందుకమ్మా నన్ను ఆపావు నిజం చెప్పేసినట్టే వాళ్ళ పరిస్థితి అయిపోయేది కదా అని అంటుంది.. ఇప్పుడు నిజం చెప్తే నలుగురికే తెలుస్తుంది రాత్రి పార్టీలో నిజం చెప్తే అందరికీ తెలిసిపోతుంది కదా అందుకే అని భాగ్యం అంటుంది.. ఇక తర్వాత ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కార్ షోరూం కి వెళ్తారు.. అక్కడికి వెళ్ళగానే ప్రేమ ఇన్ని లక్షలు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయి రా అని అడుగుతుంది.. కార్ సెలెక్ట్ చేయి ఆ తర్వాత నేను చెప్తాను అని ధీరజ్ అంటాడు.. అక్కడ కూడా వీళ్లిద్దరు గొడవ పడడంతో ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. ప్రేమ ఒకవైపు ఎంత చెప్తున్నా సరే ధీరజ్ మాత్రం కారు కొనే తీరాలి అని అనుకుంటాడు.. వీడి దగ్గర ఇంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ప్రేమ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కారును ప్రేమ పేరు మీద రిజిస్టర్ చెయ్యమని చెప్పడం వల్ల ప్రేమ షాక్ అవుతుంది. మా నాన్న ఎప్పుడూ ఏది తీసుకున్నాం మా అమ్మ పేరు మీదే తీసుకుంటాడు నాకు నువ్వు అలాగే కదా అందుకే నీ పేరు మీద తీసుకున్నాను అని సెంటిమెంట్ డైలాగులు కొడతాడు ధీరజ్.. ఆ మాటలకి ప్రేమ పొంగిపోతుంది. ఇక తర్వాత ప్రేమ ధీరజ్లు ఇద్దరు కూడా కార్ని టెస్ట్ చేస్తారు.. అక్కడ ఇద్దరు కలిసి గొడవపడతారు. ఇంక రాత్రి ప్రసాద్ఏ ర్పాటుచేసిన పార్టీకి అందరూ కూడా వెళ్తారు. ప్రసాద్ రావు తన అల్లుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడమే చాలా గొప్పగా అందరికి పరిచయం చేస్తాడు..
వేదవతి తన కొడుకు గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటే మురిసిపోతూ ఉంటుంది.. నా కొడుకు ఇంత గొప్ప వాడవుతాడని నేను చాలా సంతోషంగా ఉంటానని అనుకోలేదు అని మనసులో అనుకుంటుంది.. ఇక నర్మదా చాలా బాధపడుతూ కనిపిస్తుంటే వేదవతికి అనుమానం వస్తుంది. ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు అత్తయ్య అని నర్మదా అంటుంది. ఇక తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా సాగర్ కి కంగ్రాజులేషన్స్ చెప్తూ ఉంటారు.. అది చూసిన శ్రీవల్లి మాత్రం టెన్షన్ పడిపోతూ ఇంకా సేపట్లో మీ బండారం బయటపడుతుంది అని అంటుంది.. నర్మదను ఎలాగైనా ఇరికించాలని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి నగల గురించి కనుక్కోవాలని అనుకుంటుంది.
శ్రీవల్లి నర్మదానమ్మ దగ్గరికి వెళ్లి ఏంటి పిన్ని గారు భోజనాలు ఏర్పాట్లు చేస్తారని మాటలు కలుపుతుంది. అవునమ్మా అన్ని ఉన్నాయి అని అనగానే మర్చిపోయాను అని అనడంతో మీ అమ్మాయి నగలు ఇక్కడే పెట్టి తాళం ఎక్కడ పెట్టారో మర్చిపోయారు అంట కదా అని అంటుంది. మా అమ్మాయి నగలు ఎప్పుడో ఇచ్చేసాను కదా ఇక్కడ ఎలా ఉన్నాయి వెళ్లి నర్మదని అడుగుతాను అని అంటుంది.. మరి నగలు ఎక్కడున్నాయి ఇక్కడ పెట్టావ్ అంటావేంటి తాళం మర్చిపోయాను అని చెప్పావట. నీ దగ్గరే ఉన్నాయి కదా అని అనగానే ఏంటి పిన్ని గారు మీరు చెప్పేది అని శ్రీవల్లి ఎంటర్ అవుతుంది..
ఆ తర్వాత వేదవతి కూడా ఎంట్రవడంతో నర్మదా కంగారు పడిపోతుంది. ఎక్కడో మర్చిపోయినట్లు ఉన్నాను నాకే మతిమరుపు వచ్చేలా ఉంది అని ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేస్తుంది.. నగల గురించి పెద్ద గండం తప్పిందని ఫీల్ అయిపోతున్నావు.. ఇక అసలు గండం ఏంటో కాసేపట్లో తెలుస్తుంది అప్పుడు నీ పని చెప్తాను అని శ్రీవల్లి రివైంజ్కి ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత సాగర్ కి జాబ్ ఇప్పించిన అతను వస్తాడు. శ్రీవల్లి దగ్గరికి వెళ్ళగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. ఇతన్ని ఎలా గైన సరే వాడుకొని సాగర బండారాన్ని అని బయట పెట్టాలని అనుకుంటుంది.. మీరు జాబ్ ఇప్పించి అతనేనా అడుగుతుంది. సాగరు అతని చూసి షాక్ అవుతాడు..
Also Read : చక్రధర్ ప్రాణాలు కాపాడిన అవని.. పల్లవికి కొత్త టెన్షన్.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?
ఏదో ఒకటి దగ్గరికి వెళ్లిన శ్రీవల్లి సాగర్ ఎవరితోనో టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నారు ఎవరు అయ్యుంటారు అత్తయ్య అని అడుగుతుంది. అతని దగ్గరికి వెళ్ళగానే మా సాగర్ ఎందుకు మిమ్మల్ని చూసి కంగారు పడుతున్నారు అని వేదవతి అడుగుతుంది. ఈ జాబ్ రావడానికి కారణం నేనే ఈ జాబ్ ఇప్పించింది నేనే అని అనగానే నర్మదా అక్కడికి వచ్చి ఈ ఊర్లోనే జాబు ఇప్పించింది ఇతనే అని చెప్తుంది.. ఏంటి ఈయనే జాబు కనిపించారా నాకు చాలా సంతోషంగా ఉండండి మా అబ్బాయిని ఎక్కడికి పంపించకుండా మా కళ్ళ ముందర నుంచి ఎలా చేశారు అని అంటుంది.. ఇక భాగ్యం ఆనందరావు రామరాజుకి నిజం చెప్పాలని అనుకుంటారు అక్కడికే ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..