Gundeninda GudiGantalu Today episode march 22 nd : నిన్నటి ఎపిసోడ్ లో.. Bబాలు ఫోన్ ని ఎలాగైనా కొట్టేయాలని వచ్చిన రోహిణి వీళ్లిద్దరు ముచ్చట్లు చూసి కోపంగా ఉంటుంది.. ఏంటి వీళ్లిద్దరూ రాత్రంతా ఇలాగే ముచ్చట్లు పెట్టుకునేలా ఉన్నారు.. ఎలాగైనా సరే బాలు ఫోన్ కొట్టేసి ఆ వీడియోని తీసుకోవాలి అని రోహిణి అనుకుంటుంది. కానీ రోహిణి పప్పులేమి అక్కడ ఉడకవు. మిగతా ఇద్దరు నిద్రపోయినా సరే బాలు మాత్రం మేలుకొని మీ నాతో ముచ్చట్లు పెట్టడంతో రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. చూస్తుండగానే తెల్లారిపోతుంది.
ఇక మీనా ఎప్పుడు ఎప్పుడు తలుపు తీస్తే బాలు లోపలికి తీసుకొని వద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే శృతి రోహిణి కూడా అక్కడికి వచ్చి ఏంటి మీనా ఇంకా తలుపు తీయలేదు అని అడుగుతారు. మావయ్య నేను చెప్పేంతవరకు తలుపు తీయొద్దని అన్నారు. అందుకే వెయిట్ చేస్తున్నాను. మామ ఇంకా రాలేదు వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తాను అని నేను అంటుంది.
అక్కడికి వచ్చిన సత్యం మీనా డోర్ ఓపెన్ చేయమని అంటాడు. డోర్ ఓపెన్ చేయగానే అందరూ పడుకుని ఉంటారు. వాళ్లని లేపమ్మా అని అనగానే ముగ్గురు కోడలు కూడా తమ భర్తలను లేపుతారు. అయితే లేచిన ముగ్గురు కూడా రాత్రి ఏం జరిగింది ఎందుకు బయట పడుకున్నాము అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక మనోజ్ అయితే ఏంటి మా రూమ్ గోడల్ని లేపేసారా ఏం జరిగింది? ఇక్కడున్నాను ఏంటి నేను అని అంటాడు.. ముగ్గురు కొడుకులు లోపలికి రాగానే సత్యం అందరికీ కలిపి క్లాస్ పీకుతాడు. ముగ్గురు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదంటూ సత్యం సీరియస్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. రాత్రంతా బాలు ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది రోహిణి.. ఇంత ప్లాన్ చేసిన కూడా మనోజ్ కి తిట్లు పడుతున్నాయి కానీ బాలు దగ్గర నుంచి ఫోన్ కొట్టే లేకపోయని బాధ పడిపోతూ ఉంటుంది. ఇక ఏం జరిగినా కూడా సంతోషమే కదా నాన్న నాకు మంచి డీల్ వచ్చింది అనేసి అగ్రిమెంట్ ని చదువుతాడు మనోజ్.. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే 50 లక్షలు కట్టాలని ఉంది అని అందులో రాసి ఉందని మనోజ్ షాక్ అవుతాడు. అసలు ముఖేష్ కి రాత్రి ఏం మాట్లాడావ్ రా ఎందుకు వెళ్లిపోయాడు రా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నా నెత్తి మీదకు వచ్చేలా ఉంది అని మనోజ్ బాలుని అడుగుతాడు..
అసలు ఆ ముఖేష్ కి ఏం చెప్పారు రా ఎందుకు అతను వెళ్ళిపోయాడు అని మనోజ్ రవి, బాలును అడుగుతాడు. తాము పెద్ద వ్యాపారవేత్తలుగా నటిస్తూ అబద్ధాలు చెప్పామని, తనకు 40 కార్లు ఉన్నాయని, మీనాకు బొకే షాప్ లేదనీ, పార్లరమ్మకు ఏజెన్సీలు లేవనీ, అలాగే ఉన్నాయని, రవికి ఫైవ్ స్టార్ హోటల్స్ లేవని చెప్పాననీ అంటాడు. అతను ఒక హోటల్ లో చెఫ్ అని చెప్పినట్లు మనోజ్ కు చెప్తారు. ఆ మాట వినగానే మనోజ్ దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతాడు.. అసలు ఎవర్రా నిన్ను అనేశాలని చెప్పమన్నారు నువ్వు ఎందుకు చెప్పావు రా అసలు అని మనోజ్ సీరియస్ అవుతాడు..
అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేకే నిజాలు చెప్పేసాను ఇప్పుడు ఏంటి? అని బాలు అడుగుతాడు.. అబద్ధాలు ఏం చెప్పారు రా మళ్లీ ఏం కొంప మీదకు తీసుకొచ్చారు రా అని సత్యం అడుగుతాడు. అబద్ధాలు ఏమీ చెప్పలేదు నాన్న అని ఎంత చెప్తున్నా సరే సత్యం మాత్రం అడుగు ఒట్టేసి నిజం చెప్పండి అని అడుగుతాడు.. ఇక అబద్ధం చెప్పలేక సత్యం కు అసలు నిజం చెప్తారు.. ఆ మాట వినగానే సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఏంటి మీరు ఇలాంటి అబద్ధాలు కూడా చెప్తున్నారా కొంచెం కూడా బుద్ధి లేదా ఇలాంటి మోసాలు చేయడానికి అని క్లాసు పీకుతాడు.. ఇక తర్వాత అందరూ వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తారు. ఈ క్రమంలో ముఖేష్ కూడా అక్కడికి వచ్చి ఆ మోసగాడు ఎక్కడ అని అడుగుతారు..
Also Read : పల్లవి ఫుల్ హ్యాపీ.. అవనిని చంపేందుకు ప్లాన్..కాపాడిన చక్రధర్.. ట్విస్ట్ ఇదే..
నేను జీవితంలో పైకి రావడానికి ఇలా అబద్ధం చెప్పాను తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు అని మనోజ్ ఎంతగా చెప్తున్నా సరే.. మీ డీల్ క్యాన్సిల్ చేస్తున్నాను నాకు తిరిగి మీరు 50 లక్షలు కట్టాలి అని అంటాడు.. వాడి దగ్గర అంత డబ్బులు లేవు వాడు ఎలా కడతాడు అని బాలు కన్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు.. మరి బాలు మాట విని ఆ ముఖేష్ మనోజ్ కి డీల్ ఇస్తాడా..? లేదంటే 50 లక్షలు కట్టాలని అంటారా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..