Illu Illaalu Pillalu Sreevalli : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల కాలంలో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సీరియల్స్ డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాయి. ఇక సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకోవడంతో ఎక్కువ మంది జనాలు సీరియల్స్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు సీరియల్స్ ప్రసారమవుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా జనాలని విపరీతంగా కట్టిపడేస్తున్నాయి..
అందులో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి. ఒక మధ్యతరగతి కుటుంబంలోని తండ్రి తన పిల్లలని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు.. అలాంటి ఇంటికి కోడలుగా వచ్చిన ఒక అమ్మాయి పెత్తనం మొత్తం తానే చేయాలి అని అనుకుంటుంది.. ఆ కోడలు పేరు శ్రీవల్లి.. ఎన్నో అబద్ధాలు చెప్పి మరి ఆ ఇంటికి కోడలు అవుతుంది.. తను గ్రేట్ అని అనిపించుకోవడానికి ఇంట్లోని వాళ్లందరి బాగోతాలను బయటపెడుతూ వస్తుంది. ఈ సీరియల్ కు ఈమె ఒక హైలెట్ క్యారెక్టర్ అన్న విషయం తెలిసిందే.. ఈ పాత్రలో నటిస్తున్న నటి పేరు త్రివేణి యాదవ్.. ఈమె ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు నెటిజెన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు ఈమె ఆస్తులు విలువ ఎంత? అలాగే ఆమె ఒక రోజుకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు పెద్ద కోడలు పాత్రలో నటించింది శ్రీవల్లి… ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ ద్వారా ఆమెకు మంచి ఫ్రేమ్ దక్కింది.. కర్నింగ్ ఆలోచనలు ఉన్నా ఒక అమ్మాయి ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెడితే ఆ కుటుంబంలోని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ అమ్మాయి చివరికి ఏం చేయాలనుకుంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ. శ్రీవల్లి అసలు పేరు విషయానికొస్తే త్రివేణి యాదవ్.. ఈమె ఇప్పటికే పలు సీరియల్స్లలో నటించింది.. సుందరి అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. అంతకుముందు టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యి జబర్దస్త్, ఢీ షో వంటి వాటిల్లో మెరిసింది.. ఆ తర్వాత సుందరి అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.. తన నాచురల్ నటనతో అందరినీ మెప్పించింది.. ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈమె ఇక ముందు నెగిటివ్ రోల్స్ లో కనిపించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : బుధవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
సుందరి అనే సీరియల్ ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఆ సీరియల్ లో ఈమె మెయిన్ రోడ్ క్యారెక్టర్లలో నటించింది. అందులో ఆమెకు మంచి రెమ్యూనరేషన్ కూడా దక్కింది. ఇక ఆ తర్వాత సీరియల్ గా ఇల్లు ఇల్లాలు పిల్లలు లో మంచి పాత్రలో నటిస్తుంది. ఈమె నటనకు జనాలు ఫిదా అవడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటుంది. ఒకేసారి ఈమె దాదాపు 30 వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అటు సీరియల్స్ మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఈమెకు ఫాలోవర్స్ ఎక్కువే.. ఈమె ఆస్తులు విషయానికొస్తే.. సీరియల్స్ షోల ద్వారా బాగానే సంపాదించినట్లు తెలుస్తుంది. ఓన్ హౌస్ తో పాటుగా, సొంత కారు, అలాగే స్థిరాస్తులు కూడా కూడబెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్స్ ద్వారా కోట్లు కలిగిన ఆస్తులను ఈ మధ్య అందరూ కూడబెట్టిస్తున్నారు.. మరి ఫ్యూచర్ లో త్రివేణి యాదవ్ ఎలాంటి బిజినెస్ లలోకి అడుగుపెడుతుందో చూడాలి…