Illu Illalu Pillalu Today Episode February 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమకి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.. అనుకున్న విధంగానే ప్రేమను ఒక రెస్టారెంట్నికి తీసుకొని వెళ్తాడు..అక్కడ అది చూసిన సర్ప్రైజ్ అవుతావు అని అంటాడు అనుకున్నట్లుగానే అతను ప్రేమను సర్ప్రైజ్ చేస్తాడు. ఇక తన మనసులోని మాటని బయట పెట్టేస్తాడు. నా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను ఇలాగే ప్రేమిస్తూ ఉంటాను అని ధీరజ్ చెప్పడంతో ప్రేమ అతని ప్రపోజల్ కి ఫిదా అవుతుంది.
అయితే ప్రేమ ధీరజ్ ప్రపోజల్ సీన్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. ప్రేమకి ఎలాగైనా సరే ఇవాళ ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. తను మనసులోని మాటని చెప్పలేక సతమతమవుతు ఉంటాడు. అయితే ఒక్కసారిగా ప్రేమకి ఎలాగైనా సరే తన మనసులోని ప్రేమని చెప్పాలని ధైర్యం చేసి రోస్ తీసుకొని ప్రపోజ్ చేయబోతాడు.. కానీ ప్రేమ మాత్రం అమూల్య పేరు విని ధీరజ్ మాట్లాడలేదని అనుకుంటుంది. ఆ తర్వాత సాగరు వనజకి డబ్బులు ఇవ్వాల్సిన సంగతిని రామరాజు గుర్తు చేస్తాడు.. రేపు కచ్చితంగా డబ్బులు తెచ్చి ఇవ్వాలి అని సాగర్ ని రామరాజు హెచ్చరిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషాయానికొస్తే.. వేదవతి ఒక్కటే కూర్చుని బాధపడిపోతూ ఉంటుంది.. అయితే ప్రేమ ధీరజ్లు ఇంటికొచ్చిన తర్వాత వేదవతిని చూసి ఏమైందమ్మా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావని అంటారు. ఆ తర్వాత అందరూ కలిసి వేదవతి దగ్గరికి వస్తారు.. ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు. మీ నాన్న మీ ముగ్గురు విడిపోతారని బాధపడుతున్నారు రా మీరు ఆయనకు చెప్పకుండా ఏదైనా చేస్తారేమో అని కంగారు పడిపోతూ ఉన్నాడు.. అయితే మీరు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళము అని నాకు మాట ఇవ్వండి.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మీ ముగ్గురు ఇలాగే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ నాన్న కోరుకునేది కూడా అదే నాకు మాట ఇవ్వండి అని వేధవతి అంటుంది.. అయితే సాగర్ మాత్రం మాటి ఇవ్వడానికి ఆలోచిస్తాడు కానీ ఏమైంది రా నీకు అని అందరూ అంటారు. డబ్బులు ఇస్తానని చెప్పారు లేడు రా మీరందరూ మాత్రం కలిసి ఉండాలి అని వేదవతి అంటుంది..
అంటే అన్నాను అంటారు కానీ అరే సాగర్ నువ్వు వేరే ఇంటికి వెళ్లాలని ఆలోచిస్తున్నావా అని వేదవతి అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నీకు మాటిస్తున్నాను అని అంటాడు సాగర్.. చందు మిల్లు నుంచి వచ్చిన డబ్బులని లెక్క పెడుతూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి అయ్యబాబోయ్బావ ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అని అడుగుతుంది.. ఏంటి అలా అడుగుతున్నావ్ ఇవి మిల్లు డబ్బులు. కానీ అని అనగానే ఏంటి ఒక్కరోజు ఇంత డబ్బులు వచ్చాయా.. వామ్మో ఈ లెక్కన ఎంత డబ్బులు వస్తాయో అని శ్రీవల్లి అనుకుంటుంది.. అవును ఇవన్నీ ఈరోజు వేనా ఇంతేనా ఇంకా ఎక్కువ వస్తాయా అని శ్రీవల్లి అడుగుతుంది.. సీజన్ కాదు కాబట్టి ఇవి తక్కువ వచ్చాయి. అదే సీజన్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ రోజుకి లక్ష పైన కూడా రావచ్చు అని చందు అంటాడు..
వామ్మో లక్షణ అలా ఏడాదికి ఎన్ని లక్షలు అలాగే రెండేళ్లకి మూడేళ్లకి అని గాల్లో లెక్కలేస్తుంటుంది శ్రీవల్లి. అయితే ఈ డబ్బులు నా దగ్గర ఉంటే నేను త్వరలోనే కోటీశ్వరులు అయిపోతాను అని కలలు కంటుంది.. ఇక ఆనంద్ రావు 2000 కొట్టేసిన విషయాన్ని చాలా సంతోషంగా వచ్చి భాగ్యంతో చెప్తాడు..ఏంటి నువ్వు మిల్లులో 2000 కొట్టేసావా ఇలా చిన్నచితక డబ్బులు కొట్టేస్తే.. అల్లుడు గారికి అనుమానం వస్తే నేను నీకు రానివ్వడు. అది ఆలోచించవా నువ్వు బుద్ధి లేకుండా చేస్తున్నావు అని గడ్డి పెడుతుంది. ఇంకొకసారి ఇలా చేసావంటే కచ్చితంగా అల్లుడు గారికి నేనే చెప్తాను అని భాగ్యం వార్నింగ్ ఇస్తుంది..
Also Read : చక్రధర్ కు అక్షయ్ స్ట్రాంగ్ వార్నింగ్.. నిజం చెప్పిన అభిరామ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..
ఇక తర్వాత సాగర్ ఒంటరిగా 20 లక్షల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. ఎలాగైనా సరే ఈ 20 లక్షలు ని తీసుకురావాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి అని బాధపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే నర్మదా సాగర్ కి భోజనం తీసుకొని వస్తుంది. భర్త రోజంతా నిలబడి పని చేశాడు అలాంటిది ఇప్పుడు నేను భోజనం పెట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది. నీకు భోజనం తినిపిస్తాను అని భోజనం తినిపిస్తూనే నర్మదా సాగర్ ని నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ రాసావు అని అడుగుతుంది. సాగర్అనుమానం వస్తే నర్మదైక వదిలిపెట్టదు అని అనుకుంటాడు.. కానీ సాగర్ మాత్రం నర్మదకు అడ్డంగా దొరికిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…