Intinti Ramayanam Today Episode April 13th: భరత్ చక్రధర్ ని ఇంట్లోంచి వెళ్లిపొమ్మని చెప్పడంతో మీనాక్షి షాక్ అవుతుంది.. ఎంత చెప్పినా ఇతను వినడం లేదు అని అనుకుంటుంది.. అయితే ఈ విషయాన్ని వెంటనే అవినికి చెప్పాలని అవని దగ్గరికి వెళ్తుంది.. అవని భరత్ అనే నేను మాట్లాడతానమ్మ నువ్వు ఏమి కంగారు పడకు అని అంటుంది.. కానీ మీ నాన్న ఇక్కడ ఉండడం మంచిది కాదు అని నేను చెప్పినా కూడా ఆయన వినడం లేదు అని మీనాక్షి అంటుంది. వీరిద్దరి మధ్యలో నేను నలిగిపోయేలా ఉన్నాను అని మీనాక్షి అనగానే అవని నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని అంటుంది..
అయితే సిస్టర్ ఇంజక్షన్ వేయడానికి అని లోపలికి వస్తే అక్కడ రాజేశ్వరి లేదు అని కేకలు పెడుతూ డాక్టర్ కి చెప్పడానికి బయటకి వస్తుంది.. ఏంటి సిస్టర్ ఏమైంది అని అనగానే అక్కడ రాజేశ్వర్ గారు కనిపించడం లేదు అని అంటుంది.. ఏంటి మామ్ కనిపించడం లేదా అని పల్లవి టెన్షన్ పడిపోతూ అక్కడ అంతా వెతుకుతుంది. హాస్పిటల్ మొత్తం పల్లవి కమల్ ఇద్దరూ కూడా వెతుకుతూ ఉంటారు.. కానీ రాజేశ్వరి ఎక్కడ కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటారు. కమల్ అవనీకి అసలు విషయం చెప్తాడు.. అక్షయ్అవని కమల్ అందరూ కలిసి రాజేశ్వరి ఎక్కడ ఉందని వెతకి ఎంత ప్రయత్నం చేస్తారు…
రాజేశ్వరి తన ఫ్రెండు డాక్టర్ నీలిమను తీసుకొని తాను డెలివరీ అయిన హాస్పిటల్ కి వెళుతుంది.. నేను డాక్టర్ని కాబట్టి లోపలికి వచ్చి నిజాలను తెలుసుకోలేను.. నువ్వు వెళ్లి నీకు కావాల్సిన నిజాన్ని తెలుసుకొని ఆమె పంపిస్తుంది. లోపలికి వెళ్లిన రాజేశ్వరి 25 ఏళ్ల క్రితం తాను డెలివరీ అయిన విషయాన్ని అక్కడ చెప్తుంది. అక్కడ రిజిస్టర్ ప్రకారం చూస్తే ఆమెకి పుట్టింది కొడుకే అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే మీనాక్షికి కూతురు పుట్టింది అని తెలుసుకున్న రాజేశ్వరి భరత్ తన కొడుకు అని తన ఫ్రెండ్ తో చెబుతుంది.. నా కొడుకు ఎలాగైనా నాకు కావాలి అని రాజేశ్వరి అనుకోవడం జరుగుతుంది.
అవని పల్లవి కమల్ అక్షయ్ అందరూ కలిసి రాజేశ్వరిని డిశ్చార్జ్ చేయగానే ఇంటికి తీసుకుని వస్తారు.. అవని హారతి ఇచ్చి రాజేశ్వరిని లోపలికి తీసుకుని వస్తుంది. అయితే లోపలికి వెళ్లి అందరూ కూర్చోగానే రాజేశ్వరికి జ్యూస్ కావాలి అని అవని అడుగుతుంది.. నేను నీతో మాట్లాడాలి అని అవని రాజేశ్వరి లోపలికి తీసుకుని వెళుతుంది.. అయితే పల్లవి ఎందుకు అవనేని లోపలికి తీసుకొని వెళుతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. మళ్లీ వీళ్ళిద్దరూ కలిసిపోయారా ఏంటి అని తెలుసుకోవాలని తలుపు దగ్గర చాటుగా వినాలని అనుకుంటుంది..
నేను హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకున్నాను భరత్ నా కొడుకు అని తేలింది.. అయితే నాకు ఇప్పుడు నా కొడుకు కావాలి పాతికేళ్లు పెంచుకున్న నా కూతురు కావాలి అని రాజేశ్వరి అంటుంది.. మీరు ఎలాగైతే మీ కొడుకుని కావాలి అనుకున్నారు మా అమ్మ కూడా మీ కొడుకుని అంతకంటే ఎక్కువ ప్రేమగానే చూసుకుంది.. తల్లి కొడుకులని దూరం చేసిన పాపం నాకు వద్దు అని అవని అంటుంది.. ఇక తర్వాత పల్లవి రాజేశ్వరి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది.. అవనితో ఏం మాట్లాడావని ఎంత అడిగినా సరే చెప్పదు.. వీరిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు.. అవినీతో మామ్ ఏదో చెప్పింది అని పల్లవి అనుకుంటుంది.. రాజేశ్వరిని ఎంతగా అడుగుతున్నా సరే తను మాత్రం నిజం చెప్పకపోవడంతో పల్లవికి అనుమానం మొదలవుతుంది. మామ్ ఏదో మాట్లాడింది కానీ చెప్పడం లేదు అని అనుకుంటుంది.. అవని అక్షయ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తామని భానుమతి తో చెప్పి వెళ్లిపోతారు. అవని మాత్రం తన తల్లికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది.. ముందు నాన్నకి ఈ విషయం చెప్పాలి అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మీనాక్షికి భరత్ అన్న కొడుకు కాదు అన్న నిజాన్ని చెప్తారా? అవని రాజేశ్వరి కి భరత్ ని ఇచ్చేస్తుందా..? అసలేం ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం పరిస్థితి ఏంటి..?