Intinti Ramayanam Today Episode February 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రధర్ జైలు నుంచి ఇంటికి రాగానే రాజేశ్వరి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.. నాకు చాలా బాధగా ఉంది రాజేశ్వరి నన్ను మీ వాళ్ళు ఇంకా నమ్మడం లేదు.. నాన్నకు అలా జరగడానికి కారణం నేనే అని ఇంకొకటి అని నా మీద నిందలు వేస్తూనే ఉన్నారు.. జైలుకు వెళ్లడం పెద్ద ప్రాబ్లం కాదు కానీ మీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకోవడమే నాకు బాధగా ఉంది అని ముసలి కన్నీళ్లు కారుస్తాడు చక్రధర్..
అక్కడికి వచ్చిన పల్లవి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. డాడ్ మీకోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు మేలుకొని మీకోసం వెయిట్ చేస్తాను.. ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పల్లవి మురిసిపోతుంది. అయితే చక్రధర్ కి మీనాక్షిని కిడ్నాప్ చేసిన విషయాన్ని చెప్తుంది. రాజేంద్రప్రసాద్ ని చంపడానికి మనమే ప్రయత్నించామని అవని అనుమాన పడుతుంది.. ఇంట్లో జరుగుతున్న వాటన్నిటికీ కారణం నేనే అని నామీద అవనికి అనుమానం వచ్చింది.. దాన్ని డైవర్ట్ చెయ్యడానికే మీనాక్షి కిడ్నాప్.. మీనాక్షికి పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చక్రధర్ రాజేశ్వరి ఇంటికి వస్తారు. చక్రధర్ ని చూసిన అక్షయ తో పాటు మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు కూడా రెచ్చిపోతారు.. మా ఇంటికి ఎందుకు వచ్చావురా అని అంటారు.. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా ఇంటికి వస్తావని గొడవకు దిగుతారు.. అది చూసిన రాజేశ్వరి నా భర్తని కొట్టడానికి మీరెవరు ఎంత ధైర్యం ఉంటే నా భర్త కాలర్ పట్టుకుంటారు అని రాజేశ్వరి సీరియస్ అవుతుంది.. అక్షయ్ నీ కొట్టడంతో అవని నా భర్తను కొడుతున్నారేంటి అని అడుగుతుంది.. ఆడదానివి కాబట్టి బతికి పోయావు లేదంటే నీకు కూడా చెంప పగలకొట్టేది అని రాజేశ్వరి అంటుంది… డాడీ ని జైలు నుంచి తీసుకురాకుండా అడ్డుకునేది ఈ అవన్నీ పల్లవి అనడంతో కమల్ పల్లవి పై సీరియస్ అవుతాడు.. మీ నాన్న చేసిన దుర్మార్గపు పనుల వల్లే మా అన్నయ్య వదిన మీ నాన్నని జైల్లో పెట్టించారు.. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది అని కమల్ వార్నింగ్ ఇస్తాడు..
ఇంకా తర్వాత రాజేశ్వరి వాళ్ళు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. నా అల్లుడు జైలు నుంచి వచ్చాడు అని మేము అందరం సంతోషిస్తుంటే మీరేం గొడవ పడుతున్నారు అని భానుమతి అరుస్తుంది.. నా అల్లుడు ఇన్ని రోజులకి ఇంటికి వచ్చాడు కదా ఏదైనా మంచిగా వండి పెట్టాలి. పార్వతి నువ్వు ఆ వంట సంగతి చూడు అని భానుమతి చాలా సంతోషంగా చెప్తుంది. అల్లుడుగారు మీకు ఏం చేయమంటారు అని భానుమతి అడగ్గానే చక్రధర్ మీ ఇంట్లో తినడం కన్నా జైల్లోనే చిప్పకూడు తినడం మేలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అవనిని రాజేశ్వరి అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడిపోతూ ఉంటుంది.. నన్ను ఎందుకు ఇంతగా ద్వేషిస్తుంది అన్నది అర్థం కావడం లేదు అని అవని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చక్రధర్ తన ఫ్రెండు తనని రిలీజ్ చేశాడని ఆనందంతో పార్టీ చేసుకుంటాడు.. అయితే చక్రధరకు తన ఫ్రెండు పల్లవి రిలీజ్ చేయద్దు అని చెప్పింది అని చెప్పగానే షాక్ అవుతాడు కానీ అసలు నమ్మడు.. నా కూతురు ఎందుకు అలా చేస్తుంది? నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు అని పల్లవి గురించి నమ్మకంగా చెప్తాడు చక్రధర్.. ఇక ఇద్దరూ కలిసి ఫుల్లుగా తాగుతూ ఉంటారు.. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన అక్షయ్ ఇంటికి వస్తాడు. ఇంట్లోకి రాగానే పల్లవిని కేకలు వేసి అరుస్తాడు..
పల్లవి ఎక్కడుంది పిలువు అని కమల్పై సీరియస్ గా అరుస్తాడు అక్షయ్.. పల్లవి రాగానే నువ్వు మా నాన్నని చంపాలనుకుంటావా అని దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు. ఫంక్షన్ రోజు వేసుకున్న చీర బ్రేస్లెట్ ఒకసారి తీసుకురాని అక్షయ్ ఎంతగా చెప్తున్నా సరే పల్లవి దొరికిపోయాను అని ఫీల్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర అవి లేవు అని ఎంతగా చెప్తున్నా సరే అక్షయ్ మాత్రం నాకు అభి మొత్తం చెప్పాడు. మా నాన్నని చంపాలి అనుకుని నువ్వే అని షాక్ ఇస్తాడు.. అయితే ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా పల్లవి చేసిన పనికి తిడుతూ ఉంటారు. మా నాన్నని చంపాలనుకున్న దీన్ని అసలు బ్రతకనివ్వను అని కమల్ పల్లవిని చంపబోతాడు.. పల్లవి అడ్డంగా దొరికిపోయాను అని ఫీల్ అయ్యి కంగారు పడిపోతూ ఉంటుంది..
Also Read :‘గుండెనిండా గుడిగంటలు ‘ శృతి ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
ఒక్కసారిగా పల్లవి ఉలిక్కిపడి లేస్తుంది.. ఒకవేళ ఇంట్లో నిజం తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. మా డాడీకి ఫోన్ చేసి ఏం చేయాలో ఒకసారి కనుక్కోవాలి అని అనుకుంటుంది ఇక చక్రధర్ కి ఫోన్ చేసి చెప్పగానే ఆ మీనాక్షిని లేపేద్దామని చక్రధరంటాడు.. మనం లేపేయాల్సింది మీనాక్షిని కాదు డాడ్ అవనీని అని పల్లవి చెప్పగానే చక్కగా కూడా సరే అమ్మ అవని లేపేసే ప్లాన్ చేద్దామని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఎపిసోడ్లో అవనిని చంపేందుకు పల్లవి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. మరి అవని చచ్చిపోతుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి…