Intinti Ramayanam Today Episode February 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని తన తల్లి ఎక్కడుందో వెతకాలని అనుకుంటుంది. తల్లి గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్లిపోతుంది. పల్లవి అది గమనించి గొంతు మార్చి ఎవరో తెలియని వ్యక్తి లాగా ఫోన్ చేసి చెప్తుంది. మీరు అవని నేను అండి మీ అమ్మగారు ఇక్కడ రామాలయంలో కనిపించారు మీరు రండి అని చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న అవని అవునండి మా అమ్మగారే ఎక్కడ కనిపించారు ఏ రామాలయంలో అని అడుగుతుంది. ఇక పల్లవి అవని బయలుదేరిన విషయాన్ని చక్రధర్ కు ఫోన్ చేసి చెప్తుంది.
ఇక ఆ డ్రైవర్ కి ఫోన్ చేసి అవని వస్తున్న విషయాన్ని చెప్తాడు చక్రధర్.. అవని రావడం గమనించిన డ్రైవరు తనని ఎలాగైనా సరే ఇవాళ చంపేయాలని అనుకుంటాడు. అక్కడే సీన్ రివర్స్ అవుతుంది.. చక్రధర్ ను యాక్సిడెంట్ నుంచి అవని కాపాడుతుంది. విషయం తెలుసుకున్న చక్రధర్ తన కూతురు తన ప్రాణాలని కాపాడింది అని సంతోష పడతాడు. కట్టుతో ఇంటికొచ్చిన అవి నేను చూసి పల్లవి అయ్యో ఇది బతికి వచ్చింది అని షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని దగ్గరకు వచ్చినా అక్షయ్ నిజంగా నువ్వు కింద పడిపోయావా నాకు కూడా అబద్ధం చెప్పాలని అనుకుంటున్నావా అని అంటాడు. మీకు నేనెందుకు అబద్ధం చెప్తానండి ఆ చక్రధర్ ని ఒక ప్రమాదాన్ని ఇచ్చి కాపాడిపోయాను. అప్పుడు నాకు ఇంకా ఏం తగిలింది అని అసలు నిజం బయటికి చెప్పేస్తుంది. ఆ తర్వాత అలాంటి దుర్మార్గున్ని చంపేయనే కాకుండా ఎందుకు నువ్వు అడ్డుకున్నావు అని అక్షయ్ సిరీస్ అవుతాడు.. అలాంటి దుర్మార్గుడ్ని చస్తే చావని అని వదిలేయాలి కానీ ఇలా నువ్వు కాపాడటం నాకు నచ్చలేదు అవని అని అక్షయ్ అంటాడు. చూస్తూ ఒక ప్రాణం పోతుంటే ఎలా ఆపుతారండి. ఆయన నా తండ్రి అని కాకుండా ఒక సాటి మనిషి అని ఆలోచించి కాపాడాను అంతే అని అవని అంటుంది.
ఇక పల్లవి అవని బతికి వచ్చింది అంటే నాకు మళ్ళీ ఏదో ఒక టెన్షన్ తెచ్చి పెడుతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ అవన్నీ చంపమని డాడ్ ప్లాన్ చేస్తే అదేంటి ఇలా రివర్స్ అయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు డాడీ ఎందుకు అవని నీ చంపకుండా వదిలేశాడు అర్థం కావడం లేదు ఎలాగైనా సరే తెలుసుకోవాలని అనుకుంటుంది.. రాజేశ్వరి చక్రధర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కట్టుతో ఇంటికి వచ్చిన చక్రధారిని చూసి కంగారు పడిపోతుంది.. ఏంటండీ ఆ తలకి కట్టేంటి ఏం జరిగింది అని కంగారు పడిపోయి అడుగుతుంది.. కారు డోర్ తగిలింది అలా హాస్పిటల్ కి వెళ్ళొచ్చాను అని అతను అబద్ధం చెప్తాడు.
నీకు ఈమధ్య ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు దిష్టి తగిలినట్టుంది అని రాజేశ్వరి వెళ్లి దిష్టి తీయడానికి మిరపకాయలు తీసుకుని వస్తుంది. అవనీవల్లే ఇదంతా జరిగి ఉంటుంది అవినీకళ్ళు అంత మంచివి కాదండి అని రాజేశ్వరి తిడుతూ ఉంటుంది.. అయితే అదేం లేదులే రాజేశ్వరి ఏదో జరిగిపోయింది అలా అని ఎన్నిసార్లు చెప్పినా సరే వినకుండా దిష్టి తీసేస్తుంది. చక్రధర్ అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. దిష్టి తీసిన ఆ ఉప్పు మిరపకాయలని స్టవ్ మీద వేస్తుంది రాజేశ్వరి. అవని దిష్టి చాలానే ఉంది వామ్మో ఇంత దిష్టి తగిలిందా అని అనుకుంటుంది..
అవని ఉదయాన్నే బయటకు వెళుతూ ఉంటే పార్వతి ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతుంది. గుడికి వెళ్దామని అనుకుంటున్నాను అత్తయ్య మనశ్శాంతిగా లేదు గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అని అవని అంటుంది. అవును నేను కూడా వస్తాను పదండి అని అంటే అక్షయ్ పల్లవి శ్రీయ నాన్నగారిని బాగా చూసుకోరమ్మా నువ్వు కూడా వచ్చేస్తే ఎవరు చూసుకుంటారు అని అంటాడు. అవును కదరా మీరు ఇద్దరు వెళ్ళండి నేను తర్వాత వెళ్తాను అని పార్వతి అంటుంది.. గుడికి వెళ్ళినా అవని అక్కడ వాళ్ళ అమ్మ గురించి కోరుకుంటూ 105 ప్రదక్షిణాలు చేయాలి అని అనుకుంటుంది.. ప్రదక్షిణాలు చేస్తున్న సమయంలో అవినీ కళ్ళు తిరిగి కిందపడిపోతుంది.
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మదా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
మీ అమ్మ గురించి ఆలోచించడం తప్పులేదు అవని ఇలా నువ్వు ఓపిక లేకపోయినా సరే ప్రదక్షిణాలు చేయడం మంచిది కాదు అని అక్షయ్ అంటాడు. ఇక తర్వాత పల్లవి వాళ్ళ డాడీ కి ఫోన్ చేస్తుంది. అవన్నీ నేను చంపాలి అనుకున్న ప్లాను ఫెయిల్ అయింద డాడ్ ఎందుకు ఏమైంది ఏం జరిగింది అని టెన్షన్ పడుతూ అడుగుతుంది.. చచ్చిపోతుంది అనుకుంటే అది కచ్చితంగా జరగలేదు.. హ్యాపీగా ఇంటికి వచ్చింది అని పల్లవి చక్రధారితో చెప్తుంది.. అవంతగా నేను తర్వాత చెప్తాలేమ్మా అని చక్రధర్ ఫోన్ పెట్టేస్తాడు.. ఇక పల్లవి మనిద్దరం కలవాలి అని అడుగుతుంది. చక్రధర్ ను కలవడానికి ఒక ప్లేస్ కి వెళుతుంది. అక్కడ మాట్లాడుతూ ఉండగా చెట్టు పైనుంచి కొమ్మ విరిగిపడి కింద పడిపోతుంది.. అది గమనించిన పల్లవి పక్కకు తప్పుకుంటుంది కానీ ఆ కొమ్మొచ్చి చక్రధర్ పై పడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..