Intinti Ramayanam Today Episode January 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని పుట్టుక గురించి నిజం తెలుసుకున్న రాజేంద్ర తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి కలిసి మాట్లాడేసి ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అని చెప్తాడు. అయితే అందరూ కూడా ఆస్తి పంపకాల గురించి క్లారిటీ ఇవ్వడంతో నేను కూడా ఆలోచిస్తానని అక్కడి నుంచి వచ్చేస్తాడు.. రాజేంద్రప్రసాద్ ఇంటికి వస్తున్న దారిలో దాహం వేయడంతో రాజేంద్ర ఒక షాపుకు వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటాడు. అయితే అక్కడ పల్లవి కనిపించడంతో ఏం జరిగిందో అని అక్కడికి వెళ్తాడు.
పల్లవి ఇక్కడ ఏం చేస్తుంది అని అడగబోతున్న సందర్భంలో పల్లవి ఎలాగైనా సరే మా డాడీకి ఫోన్ చేసి నిజం చెప్పాలని అనుకుంటుంది. మొన్న చక్రధర్ ఫోన్ చేసిన కానిస్టేబుల్ కి ఫోన్ చేస్తుంది.. నేను చక్రధర్ గారి కూతురు అండి మొన్న మీరు ఫోన్ చేశారు కదా ఒకసారి ఆయనకి ఇస్తారా నేను మాట్లాడాలి అని అంటుంది.. చక్రధర్ తో మాట్లాడటం రాజేంద్ర వింటాడు.. ఇక ఆ విషయాన్ని ఎలాగైనా సరే అవనితో తెలుసుకోవాలని అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి గురించి రాజేంద్రప్రసాద్ అవనీతో చెప్తాడు. ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు మామయ్య మీరందరూ బాధపడతారని నేను ఎవరికీ చెప్పలేదు అని అవని అంటుంది.. పల్లవి నే ఇదంతా చేసింది అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అసలు పల్లవి ఇలాంటిది అని నేను అస్సలు ఊహించలేదని రాజేంద్ర అంటాడు.. పల్లవి గురించి నాకు ముందే తెలుసు మావయ్య గారు అని అంటుంది.. ఏంటమ్మా అవని నువ్వు మాట్లాడేది అని రాజేంద్ర అడుగుతాడు.. పల్లవి ఎలాంటి పనులు చేసిందో అన్ని విషయాలను అవని చెప్తుంది.. అవును మావయ్య గారు మనము శ్రీకర్ దూరంమవ్వడానికి కారణం మనమే అని ముఖ్యంగా నేను అని నామీద కోపాన్ని పెంచుకుంది..
నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. నన్ను ఇంట్లో నుంచి గెంటేసేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది అత్తయ్య గారి మనసుని చెడిపోయేలా చేసి నా మీద కోపాన్ని పెంచుకునేలా చేసింది. అంతేకాదు నా భర్తని నాకు దూరం చేసింది ఆఖరికి నా కూతుర్ని కూడా నాకు దూరం చేయాలని చూసింది ఇలాంటి పల్లవి ఇంకా ఎన్నో మోసాలు కుట్రలు చేస్తూ వస్తుంది. ఇంటిని నా వాళ్ళని కాపాడుకునేందుకు నేను ఎప్పుడూ పల్లవిని ఎదుర్కొంటూనే వస్తున్నాను. మరి ఇన్ని రోజులు ఈ విషయాన్ని మాకెందుకు చెప్పలేదు రాజేంద్ర అడుగుతాడు..
మీకు చెప్తే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది కన్నయ్యా జీవితం నాశనం అయిపోతుందని ఆగాను మావయ్య గారు అని అవని అంటుంది. నా తోడు కోడలు అని తెలిస్తేనే తన జీవితం బాగుండాలి అని అనుకున్నాను. ఇప్పుడు నా సొంత చెల్లెలు అని తెలిసి తన జీవితాన్ని ఎలా నాశనం చేస్తాను మావయ్య గారు అని అవని అంటుంది. ఆ మాట విన్న రాజేంద్రప్రసాద్ అవనీ పిచ్చితనాన్ని మెచ్చుకోవాలో తిట్టాలో అర్థం కావట్లేదు అని వెళ్ళిపోతాడు.. ఇక ఆ తర్వాత ఉదయం రాజేంద్రప్రసాద్ ఇంట్లోని వాళ్ళ అందరితో ఇవాళ పనులు ఏమి పెట్టుకోవద్దు మన ఫామ్ హౌస్ లో చిన్న పార్టీ ఉంది అని అంటాడు..
Also Read : దెయ్యం దెబ్బ అదుర్స్.. కాలు జారిన ప్రభావతి.. ప్రభావతికి శృతి వార్నింగ్..
అది కాదు నాన్న ఇవాళ ఇంజనీర్ గారు వస్తున్నారు చాలా ముఖ్యం కదా అని అక్షయ్ ఎంతగా అంటున్న సరే.. లేదు ఇవాళ చాలా ముఖ్యమైన రోజు తర్వాత పెట్టుకోవచ్చు లే అని రాజేంద్ర అంటాడు. టైం తక్కువ ఉంది కదా మీకు తెలిసిన వాళ్ళని మీ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలవండి అని రాజేంద్ర వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత రాజేంద్ర ని ఫాలో అవుతూ పల్లవి కూడా వెళ్లిపోతుంది.. అయితే రాజేంద్రప్రసాద్ లాయర్ దగ్గరికి వెళ్లడం చూసిన పల్లవి ఎందుకు వచ్చాడు లాయర్ దగ్గరికి అని అనుకుంటాడు. అయితే వెనకాల వెళ్లిన పల్లవి ఎలాగైనా సరే తెలుసుకోవాలని అనుకుంటుంది.. ఆస్తి పంచడం గురించి తెలుసుకున్న పల్లవి సంతోషపడుతుంది.. రాజేంద్రప్రసాద్ సగం ఆస్తిని అవని పేరు మీద రాయడంతో షాక్ అవుతుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఈ పార్టీని సడన్గా ఎందుకు పెట్టాడు అర్థం కావడం లేదు అని అందరూ అనుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…