Intinti Ramayanam Today Episode june 11th : మా అమ్మని బయటకు తీసుకొచ్చే ఆలోచన రావడం లేదు అని అటు అవని. ఇటు చక్కధర్ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే అప్పుడే కమల్ అక్షయ్ ఇంట్లోకి వచ్చి వదినా నీకు గుడ్ న్యూస్ అని చాలా సంతోషంగా చెప్తాడు. పల్లవి పైనుంచి కిందకి దిగి రావడం చూసి కమల్ మాట మార్చి వేరే మాటలు మాట్లాడుతాడు.. మొత్తానికి అక్కడ సుబ్బారావు సిసి టీవీ ఫుటేజ్ను ఇస్తానని చెప్పినట్లు అవనితో చెప్తాడు.. సరే నాన్న నువ్వు ఇక్కడే ఉండు మేము ఫుటేజ్ చూడడానికి వెళ్తాము అని అక్కడికి వెళ్తారు.. అయితే సుబ్బారావు ఫుటేజ్ ఇచ్చే టైంకి వాళ్ళ ఆవిడ వస్తుంది..
కమల్ నువ్వు సీసీటీవీ ఫుటేజ్ చూపించాలి. దాన్ని చూడటానికి మా వాళ్లు కూడా వచ్చారు అని చెప్పగానే.. ఏంటి ఆ వీడియోని మీ వాళ్లకు కూడా చూపించవా అని సుబ్బారావు కంగారు పడిపోతూ ఉంటాడు.. లేదు నేనేమీ చూపించలేదు ఒకవేళ సిసిటివి ఫొటోస్ చూపించలేకపోతే ఆ వీడియోని మా వాళ్లకు మాత్రమే కాదు ఊర్లో మీ అందరికీ చూపిస్తానని అంటాడు కమల్.. ఇక అన్నది లోపలికి తీసుకుని వెళ్లి కూర్చోబెట్టి ఆ వీడియోని చూపించేందుకు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు.. అప్పుడే ఏం జరుగుతుంది ఇక్కడ అని తన భార్య నిర్మల ఎంట్రీ ఇస్తుంది.. సీసీటీవీ ఫుటేజ్ చూపించొద్దు అని అనుకున్నారు కదా.. అసలు పని చేయలేదని చెప్పారు కదా మళ్లీ ఇప్పుడు ఏంటి వాళ్లకి ఎందుకు చూపిస్తున్నారు అని అడుగుతుంది. ఇక నిర్మల అని లోపలికి తీసుకొని వెళ్ళిన సుబ్బారావు ఏదో ఒకటి చెప్పి బ్రతిమలాడి తనని వీడియోని చూపించేందుకు ఒప్పిస్తాడు..
బయటికి వచ్చిన సుబ్బారావు పెళ్లాలని ఎలా దారికి తెచ్చుకోవాలో అలానే తెచ్చుకోవాలి.. అప్పుడే మాట వింటారు లేదంటే వాళ్ళు మన నెత్తిన కూర్చుంటారు అని సుబ్బారావు కావాలనే లోపలికి వెళ్ళింది ఒకటి.. చేసింది ఒకటి అన్నట్లుగా బయటకు వచ్చి కోతలు కోస్తాడు.. అయితే అక్కడ వీడియోని చూసి అవని షాక్ అవుతుంది.. అన్ని సీసీ కెమెరాలు అని చూస్తున్నా వాళ్లకు ఈ వీడియోలో ఏమీ లేదని తెలుసుకొని ఒక్కసారిగా కంగారు పడిపోతారు.. కేవలం సుబ్బారావు ఆయన భార్య నిర్మల మాత్రమే ఆ వీడియోలో కనిపిస్తారు.. అక్కడ ఏం జరిగిందో అన్నది వీళ్ళిద్దరూ చూసి ఉంటారు.. ఆ విషయాన్ని అవనితో చెప్తారు..
సుబ్బారావు నిర్మల ఇద్దరు కూడా ఆ విజువల్స్ చూపించండి అని చెప్తారు.. కానీ అవని అక్కడికి ఏమీ లేదు కాబట్టి మీరు వచ్చి కోర్టులో ఈ విషయాన్ని చెప్తారా అని అడుగుతుంది అవని. సరే మేము చెప్తాము అని సుబ్బారావు అంటాడు.. అటు పల్లవి మీనాక్షి నీ కోర్టులో రేపు సబ్మిట్ చేస్తారు కాబట్టి బెయిల్ రాకుండా తనని జీవితాంతం జైల్లో ఉండేలా చేయాలి అని కుట్ర చేస్తున్నట్లు భానుమతితో చెప్తుంది.. ఇక భానుమతి అవనీని ఏమైనా చేసుకోగానే ముందు నువ్వు భోజనం తినేసి పడుకో అని అంటుంది.. అవని తన తల్లిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నేను మాత్రం తనని జీవితాంతం జైల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాను అని పల్లవి అంటుంది.
చక్రధర్ మీనాక్షి ఎక్కడ బయటికి రాదు అని బాధ పడిపోతూ ఉంటాడు.. అయితే అక్కడికి వచ్చిన అవని ఏంటి నాన్న ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా మీ అమ్మని రేపు కోర్టులో హాజరు పరిచయం ఉన్నారు కదా.. అక్కడ శిక్ష పడుతుంది ఏమో అని నాకు భయమేస్తుంది అని ఆలోచిస్తున్నాను నాకు చాలా భయంగా ఉంది అని చక్రధరంటాడు.. అక్కడ జరిగింది చూసిన ఒక జంట చెప్పడానికి కోర్టుకు వస్తామని చెప్పారు. మీరు ఏమి కంగారు పడకుండా పడుకుంటున్నాను అని అవని అంటుంది. ఇక ఆరాధ్య కోసమని అక్షయ్ అవనికి ఫోన్ చేస్తాడు.. రేపు కచ్చితంగా మా అమ్మ బయటకు వస్తుంది అని అక్షయతో కూడా ధీమాగా చెప్తుంది అవని..
భరత్ పల్లవి దగ్గరికి వచ్చి మా అమ్మని విడిపించాల్సింది మీరే సిస్టర్.. తనకి శిక్ష పడకుండా చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి వస్తాడు.. కానీ పల్లవి మీ అమ్మని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నాను అని మనసులో అనుకుంటుంది. తర్వాత రోజు కోర్టుకు వెళ్లిన అందరూ కూడా మీనాక్షికి శిక్ష పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. పోలీసులు మీనాక్షిని తీసుకుని రావడంతో అవని తన తల్లిని కౌగిలించుకొని ఎమోషనల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి ప్లాన్ సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : ఒకేసారి పెళ్లి చేసుకుంటున్న సీరియల్ జోడీలు.. ఇది అస్సలు ఊహించలేదు..