Intinti Ramayanam Today Episode March 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది. అక్కడికొచ్చిన అవని ఏంటి అత్తయ్య బాధపడుతున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది.. నువ్వు ఎక్కడ నిజం చెప్పేస్తావో పల్లవిని నా కొడుకు ఎక్కడ చంపేస్తారు అని ఇంతవరకు కంగారు పడ్డాను. కానీ నువ్వు ఎక్కడ నిజం చెప్పకుండా నా మాటకు విలువిచ్చావు అని అవని పై ప్రశంసలు కురిపిస్తుంది పార్వతి.. పల్లవి మారుతుంది అని ఒక నమ్మకం నాకు కలుగుతుందా అత్తయ్య అందుకే ఎక్కడ చెప్పలేదు మీకు మాటిస్తున్నాను. ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పను అని అవని అంటుంది.. ఇక తర్వాత నువ్వు చాలా మంచి దానివి అవని కానీ నేనే అపార్థం చేసుకున్నాను అని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది.
పల్లవికి అవని దిమ్మతిరిగి పోయేలా ఒక్కొక్క షాక్ ఇస్తూ వస్తుంది. ఎక్కడో దూరంగా దాక్కొని ఆలోచిస్తూ ఉన్న పల్లవికి అవని వెళ్లి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది. నీలో ఈ సడన్ మార్పు ఏంటి అని కమల్ అడుగుతున్నాడు మరి ఏం చెప్పాలి అని అవని అంటుంది. నీలో ఈ మార్పు కి కారణం ఏంటి అన్నది చెప్పమంటావా అని అవని అంటుంది. మరి రేపటి నుంచి లేవగానే ఏం చేయాలో తెలుసు కదా అని అవని అంటుంది. అలాగే అక్క లేచిన తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అవినీకి చెప్పేసి పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది.. ఉదయం లేవగానే పల్లవి వేసిన ముగ్గురు చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. అక్షయ్ స్నానం చేస్తూ ఉంటాడు అవనిని కేకలు వేస్తాడు ఏమైందండీ ఎందుకలా అరుస్తున్నారు అని అవని వస్తుంది ఇక్కడ బాత్రూంలో వాటర్ రావట్లేదు.. అవని బయట నుంచి నాకు ఒక బకెట్ వాటర్ తెచ్చి ఇవ్వవా.. అని అనగానే సరే అండి తీసుకొని వస్తాను అని అంటుంది అవని.. ఇక కమల్ కూడా స్నానానికి వెళ్లి అక్కడ నీళ్లు రావట్లేదని పల్లవిని తీసుకురమ్మని చెప్తాడు. అక్కడికి వెళ్లిన పల్లవి బకెట్ తో వాటర్ పట్టుకొని దాన్ని మోయలేక నానా అవస్థలు పడుతూ ఉంటుంది.. ఆ బకెట్ నీళ్లను తీసుకొని వచ్చిన వెంటనే అవి కింద పడిపోవడంతో మళ్లీ బకెట్ కు నీళ్లు పట్టుకుని అతి కష్టం మీద మోసుకొని నాన్న తిప్పలు పడుతూ గుమ్మం వరకు వస్తుంది. అవని మాత్రం చాలా సునాయాసంగా ఆ బకెట్ నీళ్ళని సులువుగా మోసుకొని వెళుతూ ఉంటుంది..
అది చూసిన పల్లవి ఏం తింటుంది రా బాబు ఇలా మోసుకుని వెళ్తుంది అని షాక్ అవుతుంది.. పల్లవి మాత్రం అతి కష్టం మీద అబ్బాయిని తీసుకొని కమల్ దగ్గరికి వెళ్తుంది. అయితే బకెట్ గుమ్మం దగ్గర ఉంది తీసుకొని కమ్మలు ఎంత చెప్తున్నా సరే ఎక్కడుంది లోపల పెట్టు అని కమల్అడుగుతాడు. ఇక తర్వాత కమల్ లోపల పెట్టు అని మొత్తుకోవడంతో అబ్బాయి అక్కడ పడేస్తుంది. ఏం చేస్తున్నావ్ పల్లవి బకెట్ కూడా మొయ్యలేవా అని కమల్ తిడతాడు.. ఇక మొత్తానికి నాన్న తంటాలు పడి మరొక బకెట్ను తెచ్చి.. ఇక అవని రాజేశ్వరి పిన్నిని కలవడానికి వెళ్దామని వెళ్తుంది.
పార్వతి అవని ఇద్దరు కూడా రాజేశ్వరిని కలవడానికి వెళ్తారు.. అయితే పార్వతి అవని చూసి చక్రధర్ కిందకు వస్తాడు. నాకోసమే వచ్చావా అని అడుగుతాడు. నేను మీకోసమే మీరు రాలేదు అని అవని ఎంత చెప్తున్నా సరే రా చక్రధర్ మాత్రం తనని బ్రతిమలాడుతూ ఉంటాడు. మళ్లీ ఏం ఘనకార్యం వెలగబెడదామని వచ్చావు అని అవని దారుణంగా అవమానిస్తుంది రాజేశ్వరి.. నేను మీకోసమే వచ్చాను పిన్ని మీతో మాట్లాడాలి అని వచ్చాను అని అవని ఎంత చెప్తున్నా సరే.. రాజేశ్వరి అలాగే భానుమతి ఇద్దరు కూడా అవని ఘోరంగా అవమానిస్తారు..
Also Read :మాధవ్ ఇంటికి వచ్చిన గాయత్రి.. నారాయణ మాటకు కన్నీళ్లు.. ట్విస్ట్ ఇచ్చిన మహా…
తప్పు నీ భర్త చేస్తే అవని ఏం చేస్తుంది ఎందుకు అవనీని తిడుతున్నావు అని పార్వతి అడుగుతుంది. అయితే నీ కోడలు నిన్ను కూడా మార్చేసింది అన్నమాట.. ఇప్పుడు నీ కోడలు తరఫున వక్కతో పుచ్చుకొని నువ్వు మాట్లాడుతున్నావా అని రాజేశ్వరి పార్వతిని కూడా తిడుతుంది. భానుమతి ఏమైంది పార్వతి నీకు ఈ అవని వల్లే కదా నా కూతురు అల్లుడు దూరమయ్యారు అని అంటుంది.. ఇన్నేళ్లు అవని అవని వాళ్ళ అమ్మ మీనాక్షి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని అవమానాలు పడ్డారో మీకు తెలియదా అత్తయ్య మనమే వాళ్ళని ఎంతగా బాధపెట్టామో మీరు మర్చిపోయారా అని అడుగుతుంది.. ఇక అవని నేను చెప్పేది వినండి పిన్ని గారు అని ఎంత చెప్తున్నా సరే ఎవరి నీకు పిన్ని అని రాజేశ్వరి తిడుతుంది. ఎలా ఉన్నారో పరామర్శించాలని మనం వచ్చాము. కానీ ఇలా అవమానించేలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడతం అవని వెళ్దాం పద ఇకనుంచి పార్వతి అవని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. ఇక సోమవారం ఎపిసోడ్లో పల్లవి ఏదైనా చేసి మరోసారి ఇరుక్కుంటుందేమో చూడాలి…