Intinti Ramayanam Today Episode March 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి వంట చేయడానికి వంట గదిలోకి వెళ్తుంది. అయితే అక్కడ గ్యాస్ పనిచేయకపోవడంతో పల్లవి షాక్ అవుతుంది. అయ్యో గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఎలా వంట చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే కట్టెల పొయ్యి పెట్టి దాని మీద వంట చేయాలి అని అవని అంటుంది. కట్టెల పొయ్య దాని మీద నాకు వంట చేయడం రాదు కదా అనేసి పల్లవి అంటుంది కానీ పార్వతి మాత్రం. కమల్ ని పిలిచి కట్టెల పొయ్యిని ఏర్పాటు చేయమని చెప్తారు. ఆ కట్టెలు పోయినాయి పెట్టగానే పల్లవి దానిమీద పొగ ఊదుకుంటూ వంట చేయడానికి పల్లవి రెడీ అయిపోతుంది..
ఇక లోపలికి వెళ్ళిన పార్వతి అవని దగ్గర రాజేంద్ర పర్స్చూసి షాక్ అవుతుంది. అయితే ఆ పర్సు కింద పడిపోవడంతో పల్లవి దగ్గరికి వచ్చిన పార్వతి పల్లవిని కొడుతుంది ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి తనకి ఒక్కసారిగా వ్యతిరేకంగా మారడంతో పల్లవి షాక్ అవుతుంది.. అవని అలాగే పార్వతి రాజేశ్వరిని చూడడానికని అక్కడికి వెళ్తారు. రాజేశ్వరి అవని దారుణంగా అవమానిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేశ్వరి మాటతో బాధపడిన అవని బయటకు వెళ్ళిపోతుంది. అవని దగ్గరికి చక్రధర్వస్తాడు పల్లవి గురించి నువ్వు నిజం చెప్పద్దని నేను ఎన్నిసార్లు బ్రతిమలాడను నువ్వు నా మాట విని చెప్పలేదు. నువ్వు చెప్పినట్టుగా పల్లవి చేస్తుందా కానీ తనకి నిజం చెప్పకపోవడమే మంచిది. తనంతట తానే మారుతుంది అని అవని అంటుంది. నేను చక్రధర్ వల్లే నిజం చెప్పలేదని అనుకుంటున్నాడు. ఒకందుకు ఇది కూడా మంచిదే అని అవని అనుకుంటుంది.. పల్లవి మారలేదు అనుకోండి నాకు ఓపిక నశిస్తుంది. అప్పుడు నేను నిజం చెప్పాల్సి వస్తుంది అని అవని అనగానే చక్రధర్ నేను తనతో మాట్లాడి నిజం చెప్పిస్తాను అని అంటాడు. అప్పుడే పల్లవి ఫోన్ చేసి చక్రధర్ తో మాట్లాడుతుంది.. అవని ఇక్కడే ఉంది నా పక్కనే ఉంది నీ పల్లవి తో చెప్పడంతో పల్లవి షాక్ అవుతుంది..
పల్లవి ఇంట్లో పని అంతా చేసుకుని బాధ పడిపోతూ ఉంటుంది.. పల్లవి ఇంతగా మారిపోవడానికి కారణం ఏదో ఉంటుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని శ్రీయ అనుకుంటుంది.. ఒకసారి తన మార్పు కి గల కారణం ఏంటో తెలుసుకుంటాను అని శ్రేయ అనుకొని పల్లవి దగ్గరికి వస్తుంది.. పల్లవి మాత్రం శ్రేయ ఏం చెప్పిన సరే మౌనంగా చేస్తాను అని అంటుంది. పల్లవి నువ్వు ఎందుకు ఈమధ్య ఇంతగా మారిపోయావు. ఎప్పుడు ఏం చెప్పినా సరే నావల్ల కాదు నేను చేయను అని చెప్పే దానివి. ఇప్పుడు ఏం చెప్పినా చేస్తాను అని అంటున్నావు అని శ్రీయకి అనుమానం వస్తుంది.. పల్లవిని అడుగుతుంది.. కానీ పల్లవి మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతుంది..
పల్లవి నిన్నే అడుగుతున్నాను ఎందుకు నువ్వు ఇంతగా మారిపోయావు అని శ్రియ అంటుంది. మార్పు ఏమీ లేదు అని పల్లవి ఒక్కసారిగా అవని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ చెప్పినట్లు చేయకును అంటే నీకు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవు అని అవని పల్లవికి వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. అయితే శ్రేయ కి అనుమానం వచ్చిందని గ్రహించిన పల్లవి ఇందులో మారిపోవడమేముంది. తన ఎవరో తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు తనమీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను అని పల్లవి అంటుంది.. అందుకే ఇకమీదట ఏ గొడవలు లేకుండా ఇలాగే కామ్ గా ఉండాలని అనుకుంటున్నాను అని పల్లవి అంటుంది. శ్రేయ కి మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది అని అనుకుంటుంది..
Also Read : హమ్మయ్య.. శ్రీవల్లి సేఫ్.. ప్రేమ, ధీరజ్ మధ్య దూరం.. వల్లి ఫుల్ హ్యాపీ..
అవని మాత్రం చక్రధర్ తో పల్లవి ఇప్పటికీ మారలేదు.. ఇక మారుతుంది అని నమ్మకం కూడా నాకు లేదు ఎప్పుడైతే నా ఓపిక నశించి పోతుందో అప్పుడు తన గురించి నిజం చెప్తాను. ఏమైపోతే నాకేంటి అని అంటుంది.. తను ఎంత కాదనుకున్నా నీకు సొంత చెల్లెలు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అవని అని చక్రధర్ రిక్వెస్ట్ చేస్తాడు.. ఇక పార్వతీ రాజేశ్వర్ కి ఎంత చెప్తున్నా సరే పక్కనే ఉన్న భానుమతి మాత్రం అవని ఇంత కిలాడి అని అనుకోలేదు అంటూ ఇంకా ఎక్కించి చెప్పేస్తుంది. అవని మాత్రం తన గురించి పిన్ని అర్థం చేసుకుంటే చాలు అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…